Nirmala Sitharaman: 2034 తర్వాతే “జమిలి ఎన్నికలు”.. నిర్మలా సీతారామన్ క్లారిటీ..
- 2034 తర్వాతే దేశంలో జమిలి ఎన్నికలు..
- ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ ద్వారా దేశ ఆర్థిక వృద్ధి..
- గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు..
- నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు.
Read Also: Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాల జాతర.. ఈ ఫోజులు చూశారా..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
పార్లమెంట్, అసెంబ్లీ సభ్యలను ఎన్నుకోవడానికి ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే, దేశ జీడీపీ దాదాపు 1.5 శాతం వృద్ధి చెందుతుందని, విలువ పరంగా ఆర్థిక వ్యవస్థకు రూ. 4.50 లక్షల కోట్లు జోడించవచ్చని చెప్పారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై కొన్ని పార్టీలు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నాయని, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 2023 తర్వాత మాత్రమే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
‘‘ ఒకే దేశం ఒకే ఎన్నికలు’’ అనే భావన ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టింది కాదని, ఇది 1960 నుంచి ఉనికిలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. దానిని గుడ్డిగా వ్యతిరేకించే బదులు, దాని ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని మద్దతు ఇస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందని అన్నారు. దివంగత డీఎంకే పితామహుడు ఎం కరుణానిధి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ భావనకు మద్దతు ఇచ్చారని, కానీ ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి (ఎం కె స్టాలిన్) తన తండ్రి అడుగుజాడల్లో నడవడం లేదని, బదులుగా దానిని వ్యతిరేకిస్తున్నారని ఎన్ సీతారామన్ ఆరోపించారు. జమిలి ఎన్నికలు అనే భావన దేశ సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించినట్లు ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!