Nirmala Sitharaman: 2034 తర్వాతే “జమిలి ఎన్నికలు”.. నిర్మలా సీతారామన్ క్లారిటీ..
- 2034 తర్వాతే దేశంలో జమిలి ఎన్నికలు..
- ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ ద్వారా దేశ ఆర్థిక వృద్ధి..
- గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు..
- నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు.
Read Also: Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాల జాతర.. ఈ ఫోజులు చూశారా..
Also Read
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
పార్లమెంట్, అసెంబ్లీ సభ్యలను ఎన్నుకోవడానికి ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే, దేశ జీడీపీ దాదాపు 1.5 శాతం వృద్ధి చెందుతుందని, విలువ పరంగా ఆర్థిక వ్యవస్థకు రూ. 4.50 లక్షల కోట్లు జోడించవచ్చని చెప్పారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై కొన్ని పార్టీలు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నాయని, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 2023 తర్వాత మాత్రమే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
‘‘ ఒకే దేశం ఒకే ఎన్నికలు’’ అనే భావన ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టింది కాదని, ఇది 1960 నుంచి ఉనికిలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. దానిని గుడ్డిగా వ్యతిరేకించే బదులు, దాని ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని మద్దతు ఇస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందని అన్నారు. దివంగత డీఎంకే పితామహుడు ఎం కరుణానిధి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ భావనకు మద్దతు ఇచ్చారని, కానీ ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి (ఎం కె స్టాలిన్) తన తండ్రి అడుగుజాడల్లో నడవడం లేదని, బదులుగా దానిని వ్యతిరేకిస్తున్నారని ఎన్ సీతారామన్ ఆరోపించారు. జమిలి ఎన్నికలు అనే భావన దేశ సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించినట్లు ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!