Nirmala Sitharaman: 2034 తర్వాతే “జమిలి ఎన్నికలు”.. నిర్మలా సీతారామన్ క్లారిటీ..
- 2034 తర్వాతే దేశంలో జమిలి ఎన్నికలు..
- ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ ద్వారా దేశ ఆర్థిక వృద్ధి..
- గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు..
- నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు.
Read Also: Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాల జాతర.. ఈ ఫోజులు చూశారా..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
పార్లమెంట్, అసెంబ్లీ సభ్యలను ఎన్నుకోవడానికి ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే, దేశ జీడీపీ దాదాపు 1.5 శాతం వృద్ధి చెందుతుందని, విలువ పరంగా ఆర్థిక వ్యవస్థకు రూ. 4.50 లక్షల కోట్లు జోడించవచ్చని చెప్పారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై కొన్ని పార్టీలు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నాయని, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 2023 తర్వాత మాత్రమే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
‘‘ ఒకే దేశం ఒకే ఎన్నికలు’’ అనే భావన ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టింది కాదని, ఇది 1960 నుంచి ఉనికిలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. దానిని గుడ్డిగా వ్యతిరేకించే బదులు, దాని ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని మద్దతు ఇస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందని అన్నారు. దివంగత డీఎంకే పితామహుడు ఎం కరుణానిధి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ భావనకు మద్దతు ఇచ్చారని, కానీ ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి (ఎం కె స్టాలిన్) తన తండ్రి అడుగుజాడల్లో నడవడం లేదని, బదులుగా దానిని వ్యతిరేకిస్తున్నారని ఎన్ సీతారామన్ ఆరోపించారు. జమిలి ఎన్నికలు అనే భావన దేశ సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించినట్లు ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..