SIM Binding: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ సేవలు!
- కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
- సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ సేవలు
- సిమ్ యాక్టివ్గా లేకుంటే యాప్లలో లాగిన్ అవ్వడం కుదరదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమ్యూనికేషన్ యాప్ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ బైండింగ్ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్లో సిమ్ కార్డు ఉంటేనే యాప్లు పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది.
దేశంలో యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు టెలికాం మాదిరిగానే కఠినమైన నిబంధనలకు లోబడి ఉండటం ఇదే మొదటిసారి. కొత్త సిమ్-బైండింగ్ నియమం బ్యాంకింగ్, యుపీఐ యాప్ల మాదిరిగానే ఈ యాప్లకు కూడా వర్తిస్తుంది. సిమ్ యాక్టివ్గా లేకుంటే యాప్లలో లాగిన్ అవ్వడం కుదరదు. ఈ యాప్లను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఈ ప్లాట్ఫారమ్లు ఇప్పుడు యూజర్ సిమ్ కార్డ్ ఎప్పుడూ యాప్కి లింక్ చేయబడి ఉంటుంది. యూజర్ ఏ సిమ్తో అకౌంట్ రిజిస్టర్ చేశారో.. ఆ సిమ్ మాత్రమే ఫోన్లో ఉంటేనే యాప్ పని చేస్తుంది. సిమ్ తీసేసినా లేదా ఫోన్ మార్చినా యాప్ ఆటోమాటిక్గా లాగౌట్ అవుతుంది.
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
వెబ్ బ్రౌజర్ ద్వారా యాప్ను ఉపయోగించే వారి కోసం కూడా మార్పు చేయబడింది. యూజర్ వెబ్ బ్రౌజర్లో యాప్ సేవలను ఉపయోగిస్తే.. ఆ ప్లాట్ఫామ్ ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అవుతుంది. సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సిమ్ బైండింగ్ వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గించడమే కేంద్రం ముఖ్య ఉద్దేశం. 90 రోజుల్లో ఈ నిబంధనలను అమలు కానుంది.
ప్రస్తుతం చాలా మెసేజింగ్ యాప్లు మొదటిసారి ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మొబైల్ నంబర్ను ధృవీకరిస్తాయి. ఆ తర్వాత సిమ్కార్డు తొలగించినా, డీయాక్టివేట్ చేసినా.. యాప్ రన్ అవుతూనే ఉంటుంది. దాంతో సైబర్ నేరగాళ్లు యాప్స్ను వినియోగించుకోవడం సులువుగా వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటోంది. సైబర్ నిపుణులు వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని సులభంగా ట్రాక్ చేయగలరని, ఇలా చేస్తే ఆవకాశాలు బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ నియమం సైబర్ భద్రతను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్ యాప్స్.. సిమ్ ఉంటేనే సేవలందిస్తున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!