SIM Binding: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ సేవలు!
- కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
- సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ సేవలు
- సిమ్ యాక్టివ్గా లేకుంటే యాప్లలో లాగిన్ అవ్వడం కుదరదు
కమ్యూనికేషన్ యాప్ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ బైండింగ్ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్లో సిమ్ కార్డు ఉంటేనే యాప్లు పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది.
దేశంలో యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు టెలికాం మాదిరిగానే కఠినమైన నిబంధనలకు లోబడి ఉండటం ఇదే మొదటిసారి. కొత్త సిమ్-బైండింగ్ నియమం బ్యాంకింగ్, యుపీఐ యాప్ల మాదిరిగానే ఈ యాప్లకు కూడా వర్తిస్తుంది. సిమ్ యాక్టివ్గా లేకుంటే యాప్లలో లాగిన్ అవ్వడం కుదరదు. ఈ యాప్లను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఈ ప్లాట్ఫారమ్లు ఇప్పుడు యూజర్ సిమ్ కార్డ్ ఎప్పుడూ యాప్కి లింక్ చేయబడి ఉంటుంది. యూజర్ ఏ సిమ్తో అకౌంట్ రిజిస్టర్ చేశారో.. ఆ సిమ్ మాత్రమే ఫోన్లో ఉంటేనే యాప్ పని చేస్తుంది. సిమ్ తీసేసినా లేదా ఫోన్ మార్చినా యాప్ ఆటోమాటిక్గా లాగౌట్ అవుతుంది.
Also Read
- Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
- One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
వెబ్ బ్రౌజర్ ద్వారా యాప్ను ఉపయోగించే వారి కోసం కూడా మార్పు చేయబడింది. యూజర్ వెబ్ బ్రౌజర్లో యాప్ సేవలను ఉపయోగిస్తే.. ఆ ప్లాట్ఫామ్ ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అవుతుంది. సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సిమ్ బైండింగ్ వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గించడమే కేంద్రం ముఖ్య ఉద్దేశం. 90 రోజుల్లో ఈ నిబంధనలను అమలు కానుంది.
ప్రస్తుతం చాలా మెసేజింగ్ యాప్లు మొదటిసారి ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మొబైల్ నంబర్ను ధృవీకరిస్తాయి. ఆ తర్వాత సిమ్కార్డు తొలగించినా, డీయాక్టివేట్ చేసినా.. యాప్ రన్ అవుతూనే ఉంటుంది. దాంతో సైబర్ నేరగాళ్లు యాప్స్ను వినియోగించుకోవడం సులువుగా వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటోంది. సైబర్ నిపుణులు వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని సులభంగా ట్రాక్ చేయగలరని, ఇలా చేస్తే ఆవకాశాలు బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ నియమం సైబర్ భద్రతను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్ యాప్స్.. సిమ్ ఉంటేనే సేవలందిస్తున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
-
Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
-
EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!