S Jaishankar: పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్..

  • పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్..
  • ఉగ్రవాదం..వేర్పాటువాదం..తీవ్రవాదంపై భారత వైఖరి స్పష్టం..
  • ఈ మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్‌సీఓ సమ్మిట్‌లో పిలుపు..
జైశంకర్

జైశంకర్

S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్‌సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.

‘‘అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరం. చార్టర్ పేర్కొన్నట్లుగా మూడు చెడులను ఎదుర్కోవడంలో దృఢంగా, రాజీపడకుండా ఉండటం దీని అర్థం. సరిహద్దు వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ఉన్నట్లైయితే వాణిజ్యం, ఎనర్జీ ఫ్లో, ప్రజల మధ్య పరస్పర మార్పిడి, కనెక్టవిటిని ప్రోత్సహించదు’’ అని జైశంకర్ కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు.

Read Also: Bahraich Violence : బహ్రైచ్ హింసలో ఇప్పటివరకు 50 మంది అరెస్టు.. కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్

ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడం ఎస్‌సీఓ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. గ్లోబలైజేషన్, రీబ్యాలెన్సింగ్ ప్రస్తుత వాస్తవాలని, ఎస్‌సీఓ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి నిజాయితీతో కూడిన చర్చలు, విశ్వాసం పునరుద్ఘాటించడం అవసరం. ఎస్‌సీఓ మూడు చెడులను ఎదుర్కోవడంలో రాజీపడకుండా ఉండాలని సూచించారు.

సహకారం, పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలని, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గుర్తించి, నిజమైన భాగస్వామ్యాలను నిర్మించబడాలని, ఏకపక్ష ఎజెండాతో కాదు అని భారతదేశం ప్రకటనని ఎస్‌సీఓ సమ్మిట్‌లో జైశంకర్ చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి, సుస్థిర జీవనశైలిని సూచించే మిషన్ లైఫ్, యోగా, గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్, ఇంటర్నేషనల్ అండ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ ప్రోమోషన్ వంటి సుస్థిరత మరియు సమగ్ర అభివృద్ధికి భారతదేశం యొక్క ప్రపంచ కార్యక్రమాలు, జాతీయ ప్రయత్నాలను జైశంకర్ హైలెట్ చేశారు.