shivsena’s Thackeray Camp: బిల్కిస్ బానో రేపిస్టులను సత్కరించడం “హిందూ సంస్కృతా”.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
shivsena’s Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేతలకు, మాటలకు తేడా ఉంటుందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: Asia Cup: పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్పై జోరుగా బెట్టింగ్
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఇదిలా ఉంటే ఈ కేసుపై శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం స్పందించింది. తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించింది. బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడంపై మోదీ, అమిత్ షాలు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. రేపిస్టులను సత్కరించడం ‘‘హిందూ సంస్కృతా’’ అని ప్రశ్నించింది. సామ్నా పత్రికలో ‘ కడక్ నాథ్ ముంబైకర్’ బైలైన్ తో ప్రచురితమైన ఓ ఆర్టికల్ లో బీజేపీ తీరును ఎండగట్టింది. బిల్కిస్ బానో ముస్లిం అయినందు వల్ల ఆమెపై జరిగిన నేరాన్ని క్షమించలేవని.. ఇది హిందూ-ముస్లిం సమస్య కాదని.. హిందుత్వ ఆత్మ, గొప్ప సంస్కృతికి సంబంధించిందని సామ్నాలో పేర్కొంది. ప్రధాని గుజరాల్ పర్యటనలో బిల్కిస్ బానో కుటుంబాన్ని సందర్శించి ఆమెకు మద్దతు అందించాలని డిమాండ్ చేసింది.
2002లో గోద్రా రైలు దగ్ధం జరిగిన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబంలో మూడేళ్ల కుమార్తెతో పాటు ఏడుగురిని చంపారు. ఈ ఘటన తర్వాత సీబీఐ స్పెషల్ కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ద్వారా ఈ 11 మందిని ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసింది. వీరంతా 15 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు. వీరు విడుదలైన తర్వాత స్థానిక నాయకులు స్వీట్లు, పూల దండలతో సత్కరించడం వివాదాస్పదం అయింది.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!