shivsena’s Thackeray Camp: బిల్కిస్ బానో రేపిస్టులను సత్కరించడం “హిందూ సంస్కృతా”.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
shivsena’s Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేతలకు, మాటలకు తేడా ఉంటుందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: Asia Cup: పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్పై జోరుగా బెట్టింగ్
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఇదిలా ఉంటే ఈ కేసుపై శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం స్పందించింది. తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించింది. బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడంపై మోదీ, అమిత్ షాలు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. రేపిస్టులను సత్కరించడం ‘‘హిందూ సంస్కృతా’’ అని ప్రశ్నించింది. సామ్నా పత్రికలో ‘ కడక్ నాథ్ ముంబైకర్’ బైలైన్ తో ప్రచురితమైన ఓ ఆర్టికల్ లో బీజేపీ తీరును ఎండగట్టింది. బిల్కిస్ బానో ముస్లిం అయినందు వల్ల ఆమెపై జరిగిన నేరాన్ని క్షమించలేవని.. ఇది హిందూ-ముస్లిం సమస్య కాదని.. హిందుత్వ ఆత్మ, గొప్ప సంస్కృతికి సంబంధించిందని సామ్నాలో పేర్కొంది. ప్రధాని గుజరాల్ పర్యటనలో బిల్కిస్ బానో కుటుంబాన్ని సందర్శించి ఆమెకు మద్దతు అందించాలని డిమాండ్ చేసింది.
2002లో గోద్రా రైలు దగ్ధం జరిగిన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబంలో మూడేళ్ల కుమార్తెతో పాటు ఏడుగురిని చంపారు. ఈ ఘటన తర్వాత సీబీఐ స్పెషల్ కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ద్వారా ఈ 11 మందిని ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసింది. వీరంతా 15 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు. వీరు విడుదలైన తర్వాత స్థానిక నాయకులు స్వీట్లు, పూల దండలతో సత్కరించడం వివాదాస్పదం అయింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!