Bengaluru: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్.. చివరికి ఏమైందంటే..!
- విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్
- ప్రైవేట్ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్
- రూ.లక్షల్లో లాక్కుకున్న టీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఆమె ఒక విద్యావంతురాలు. అంతేకాదు. ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలని అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. విద్యార్థి తండ్రితో ఎఫైర్ పెట్టుకుంది. అనంతరం బ్లాక్ మెయిల్కి దిగింది. రూ.లక్షల్లో డబ్బులు గుంజుంది. మరింత డబ్బు కోసం నీచానికి ఒడిగట్టింది. చివరికి పాపం పండి కటకటాల పాలైంది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
పోలీసుల కథనం ప్రకారం… 2023లో పశ్చిమ బెంగళూరు పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యాపారి తన భార్య, ముగ్గురు కుమార్తెలు, ఐదేళ్ల కొడుకును తీసుకుని ప్రీ-స్కూల్కు తీసుకెళ్లి చేరిపించారు. అడ్మిసన్ సమయంలో శ్రీదేవి రుడగి (25) అనే టీచర్… వ్యాపారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంది. అతడితో రోజు ఫోన్ మాట్లాడుతూ ప్రారంభించింది. అంతేకాకుండా మొబైల్ నెంబర్లు మార్చి.. ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టారు. సందేశాలు, వీడియో కాల్స్ చేసుకోవడం జరుగుతోంది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారి నుంచి రూ.4లక్షలు బలవంతంగా శ్రీదేవి తీసుకుంది. జనవరిలో మరో రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు అతడు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ పరిణామంలోనే రూ.50వేలు అప్పుగా తీసుకునేందుకు నేరుగా వ్యాపారికి ఇంటికి వెళ్లింది. ఇక టీచర్ శ్రీదేవి టార్చర్ భరించలేక.. కుటుంబాన్ని గుజరాత్కు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు.
అయితే పిల్లల బదిలీ సర్టిఫికేట్ కోసమని మార్చి నెల ప్రారంభంలో వ్యాపారి స్కూల్కు వెళ్లాడు. నేరుగా శ్రీదేవి కార్యాలయంలోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న గణేష్ కాలే (38), సాగర్ (28) బెదిరింపులకు దిగారు. శ్రీదేవితో వ్యాపారి కలిసి ఉన్న ప్రైవేటు ఫొటోలను చూపించి బెదిరింపులకు దిగారు. రూ.20లక్షల ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని టార్చర్ పెట్టారు. చేసేదేమీలేక రూ.15లక్షలు ఇచ్చేందుకు చర్చలు జరిపాడు. వెంటనే రూ.1.9లక్షలు బదిలీ చేశాడు. మిగతావి ఇవ్వాలంటూ మార్చి 17న శ్రీదేవి ఫోన్ చేసింది. మాజీ పోలీస్ అధికారికి రూ.5లక్షలు, సాగర్, కాలేకు రూ.లక్ష చొప్పున.. శ్రీదేవికి రూ.8లక్షలు పంపించాడు. ఇక ప్రాణం విసిగిన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీచర్ శ్రీదేవితో పాటు సాగర్, కాలేలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!