Taj Mahal: తాజ్ మహల్ దగ్గర భద్రతా లోపం.. వెలుగులోకి షాజహాన్, ముంతాజ్ సమాధుల వీడియోలు
- తాజ్ మహల్ దగ్గర భద్రతా లోపం
- వెలుగులోకి షాజహాన్, ముంతాజ్ సమాధుల వీడియోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజ్ మహల్.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. దీన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 17వ శతాబ్దపు నాటి వారసత్వ సంపదను అధికారులు భద్రంగా కాపాడుతున్నారు. ఇక తాజ్ మహల్ను బయట నుంచి చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. లోపల నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. అలాంటిది నిషేధిత ప్రాంతంలో ఉన్న షాజహాన్, ముంతాజ్ సమాధుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చక్కర్లు కొట్టడంతో వారసత్వ నిపుణులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు స్మారక చిహ్న సంరక్షణకు హాని కలిగిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: MP: మధ్యప్రదేశ్లో దారుణం.. ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడిపై 13 గంటలు దాడి
Also Read
భారత పురావస్తు సర్వే సంస్థకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చే పెట్టేది తాజ్ మహలే. ప్రభుత్వ డేటా ప్రకారం.. ఐదేళ్ల కాలంలో టికెట్ల రూపంలో రూ.297 కోట్లు వచ్చాయి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోటను అధిగమించి ఆదాయం వచ్చింది.
అయితే ఈ వారసత్వ సంపదను చాలా భద్రంగా కాపాడుతున్నారు. తాజ్ మహల్ లోపల మొఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉంటాయి. వాటి లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. అలాంటిది వాటికి సంబంధించి వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kangana Ranaut : ఫైనలీ.. పెళ్లి రూమర్స్కి చెక్ పెట్టిన కంగనా రనౌత్
ఇక ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. అంతేకాకుండా అనేక కామెంట్లు కూడా పెడుతున్నారు. నిషేధిత ప్రాంతంలోకి ఆ వ్యక్తి ఎలా ప్రవేశించాడంటూ ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను 1994-95 ప్రాంతంలో తాజ్ మహల్ను సందర్శించాను. ఆ సమయంలో ప్రజలకు తెరిచి ఉండేది’’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘‘నేను కూడా దీన్ని గతంలో చూశాను.’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
భద్రతా సమస్యలు తలెత్తడంతో స్మారక చిహ్నం దగ్గర యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తాజ్ సెక్యూరిటీ) సయ్యద్ అరిబ్ అహ్మద్ ప్రకటించారు. ఈ వ్యవస్థ ప్రధాన గోపురం నుంచి 200 మీటర్లలో డ్రోన్ సిగ్నల్లను జామ్ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్, ఉత్తరప్రదేశ్ పోలీసులచే కాపలాగా ఉన్న ప్రదేశానికి కొత్త రక్షణగా ఉండనుంది.
తాజావార్తలు
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!