Bangladesh: పాకిస్తాన్తో పెరుగుతున్న బంగ్లాదేశ్ స్నేహం..
- పాకిస్తాన్తో బలపడుతున్న బంగ్లాదేశ్ స్నేహం..
- 1971 యుద్ధ సమస్యల్ని పరిష్కరించుకోవాలని యూనస్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్కి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ పాలన పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్కి దగ్గరవుతోంది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ గురువారం మాట్లాడుతూ.. తాను పాకిస్తాన్తో సంబంధాల బలోపేతానికి అంగీకరించానని చెప్పారు. ఈ పరిణామం భారత్కి ఇబ్బందికలిగించేలా మారింది.
Read Also: TG Assembly: భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఒకే దేశంగా ఉండేవి. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన భారత్పైనే ఇప్పుడు అక్కడి ప్రభుత్వంతో పాటు మతోన్మాద సంస్థలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ఈజిప్టులో జరిగిన ఒక సదస్సులో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని మహ్మద్ యూనస్ కలిశారు. 1971లో యుద్ధం వల్ల ఏర్పడిన మనోవేదనను పరిష్కరించాలని యూనస్ కోరారు. ‘‘సమస్యలు పదే పదే వస్తూనే ఉన్నాయి, మనం ముందుకు సాగడానికి ఆ సమస్యల్ని పరిస్కరించుకుందాం’’ అని యూనస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మహ్మద్ యూనస్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని షహబాజ్ షరీఫ్ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు నిబద్ధతతో ఉన్నామని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్కి దశాబ్ధాల తర్వాత ఒక కంటైనర్ షిప్ వెళ్లింది. పాకిస్తాన్ జాతీయులకు వీసా నిబంధనలను సడలిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే రోజురోజుకు రెండు దేశాల మధ్య స్నేహం బలపడుతూ ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!