Bangladesh: పాకిస్తాన్తో పెరుగుతున్న బంగ్లాదేశ్ స్నేహం..
- పాకిస్తాన్తో బలపడుతున్న బంగ్లాదేశ్ స్నేహం..
- 1971 యుద్ధ సమస్యల్ని పరిష్కరించుకోవాలని యూనస్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్కి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ పాలన పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్కి దగ్గరవుతోంది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ గురువారం మాట్లాడుతూ.. తాను పాకిస్తాన్తో సంబంధాల బలోపేతానికి అంగీకరించానని చెప్పారు. ఈ పరిణామం భారత్కి ఇబ్బందికలిగించేలా మారింది.
Read Also: TG Assembly: భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఒకే దేశంగా ఉండేవి. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన భారత్పైనే ఇప్పుడు అక్కడి ప్రభుత్వంతో పాటు మతోన్మాద సంస్థలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ఈజిప్టులో జరిగిన ఒక సదస్సులో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని మహ్మద్ యూనస్ కలిశారు. 1971లో యుద్ధం వల్ల ఏర్పడిన మనోవేదనను పరిష్కరించాలని యూనస్ కోరారు. ‘‘సమస్యలు పదే పదే వస్తూనే ఉన్నాయి, మనం ముందుకు సాగడానికి ఆ సమస్యల్ని పరిస్కరించుకుందాం’’ అని యూనస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మహ్మద్ యూనస్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని షహబాజ్ షరీఫ్ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు నిబద్ధతతో ఉన్నామని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్కి దశాబ్ధాల తర్వాత ఒక కంటైనర్ షిప్ వెళ్లింది. పాకిస్తాన్ జాతీయులకు వీసా నిబంధనలను సడలిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే రోజురోజుకు రెండు దేశాల మధ్య స్నేహం బలపడుతూ ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!