NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్
- మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- ఆమెకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ప్రశ్నపత్రాలకు ఫుల్ యాక్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. పూణేకు చెందిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ఇప్పటివరకు వివిధ నగరాల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సిబిఐ ప్రకారం, బయాలజీ ప్రశ్నపత్రం లీక్ వెనుక ఈ నిందితురాలే సూత్రధారి. నీట్-యూజీ 2026 పరీక్షా ప్రక్రియపై నిపుణురాలిగా మనీషా మంధారేను ఎన్టీఏ నియమించింది. దర్యాప్తు అధికారుల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ అయిన మంధారే, NTAకు ఎక్స్ పర్ట్ గా పనిచేశారు. ఆమెకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ప్రశ్నపత్రాలకు ఫుల్ యాక్సెస్ ఉండేది. దర్యాప్తు ప్రకారం, మంధారే పూణేలోని శివాజీనగర్ ప్రాంతంలో ఉన్న మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్లో పనిచేశారు.
నీట్ యూజీ 2026 పరీక్ష కోసం వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ప్రశ్నలను తయారు చేయడంలో మంధారే పాలుపంచుకున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. పరీక్షా విధానంలో ఆమె పాత్ర కారణంగా, మే 3, 2026న జరిగిన పరీక్షకు ముందే ఆమెకు రహస్య జీవశాస్త్ర ప్రశ్నలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 2026లో, ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మరో నిందితురాలు మనీషా వాఘ్మారే ద్వారా మంధారే కొంతమంది నీట్ అభ్యర్థులను గుర్తించారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
సీబీఐ కథనం ప్రకారం, పూణేలోని మంధారే ఇంట్లో ప్రత్యేక కోచింగ్ సెషన్లు జరిగాయి. ఈ సెషన్లలో, విద్యార్థులను వారి నోట్బుక్లలో ముఖ్యమైన వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ప్రశ్నలను రాసుకుని, వాటిని పాఠ్యపుస్తకాలలో గుర్తించమని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రశ్నలలో చాలా వరకు ఆ తర్వాత నీట్ యూజీ 2026 అసలు బయాలజీ పేపర్తో సరిపోలాయని అధికారులు చెబుతున్నారు.
ఈ ఆపరేషన్లో అంతర్గత వ్యక్తులు, మధ్యవర్తులు, అభ్యర్థులు పాల్గొన్నారని, వీరు పరీక్ష ప్రశ్నలను పొందడానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించారని ఏజెన్సీ భావిస్తోంది. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖ నుండి అందిన ఫిర్యాదు మేరకు, మే 12, 2026న సీబీఐ ఈ కేసును అధికారికంగా నమోదు చేసింది.
తాజావార్తలు
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!