NTV Telugu Site icon

PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్నసెబీ చైర్మన్ మాధబి

Sebi

Sebi

PAC-SEBI: సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ ఈరోజు (గురువారం) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ చేసింది. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పీఏసీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే, ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యులు ఆరోపణలు చేశారు. కాగా, పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పని తీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.

Read Also: KTR Tour: నేడు ఆదిలాబాద్‌ లో కేటీఆర్‌ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఎలాంటి అవకతవకలు కనిపించలేదని పేర్కొన్నట్లు సమాచారం. సెబీ చీఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. సెబీ చీఫ్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన విచారణ ముగిసింది. అయితే, మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, సెబీచీఫ్ పదవికీ మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్

కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్‌ చేసిన పోస్ట్‌ సంచలనంగా మారిపోయింది. దీంతో సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని.. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం కూడా అందుకుంటున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని విమర్శలు గుప్పించింది. అయితే, ఆరోపణలను మాధబి తోసిపుచ్చింది. తమ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటించారు.