Madhya Pradesh: గవర్నమెంట్ టీచర్ ఆస్తులు చూసి షాకైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆస్తులు చూసి అధికారులు షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఘాటిగావ్కు చెందిన ప్రశాంత్ పర్మార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం వేలల్లో మాత్రమే ఉంటుంది. అయితే అతడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో అతడి నివాసంతో పాటు ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు.
అయితే ఈ సోదాల్లో ప్రశాంత్ పర్మార్ ఆస్తుల జాబితా అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ప్రశాంత్ పర్మార్కు గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో 20 బీఈడీ, డీఈడీ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు, 4 ఆఫీసులు ఉన్నట్లు అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. అతడి ఆస్తుల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు లెక్కకట్టారు. ఆయా ఆస్తుల విలువ ఆయన సంపాదనతో పోల్చి చూస్తే 1000 రెట్ల కంటే ఎక్కువగా ఉందని స్పష్టమైంది. 2006లో గవర్నమెంట్ టీచర్గా విధుల్లో చేరినప్పుడు ప్రశాంత్ పర్మార్ నెల జీతం రూ.3,500. అయితే కొద్దికాలంలోనే అతడు ఈ స్థాయికి రావడానికి ఏ స్థాయిలో అక్రమాలు చేశాడో అని అధికారులు షాక్కు గురయ్యారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!