Sanjay Raut: చైనా లాగే కర్ణాటకలోకి ప్రవేశిస్తాం.. ముదిరిన మహా-కర్ణాటక వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut comments on Karnataka-Maharashtra border dispute: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చరాజేస్తోంది. బెలగావి ఈ మొత్తం సమస్యకు కేంద్రం అవుతోంది. గత కొన్ని దశాబ్ధాలుగా కర్ణాటకలోని బెలగావి తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి చైనా ప్రవేశించినట్లే.. కర్ణాటకలోకి మేం అడుగుపెడతాం అంటూ సరికొత్త వివాదానికి తెర లేపారు. ఈ విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు.
చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం కానీ కర్ణాటక సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్రలో బలహీనమైన ప్రభుత్వం ఉందని.. ఈ సమస్యపై ఎలాంటి స్టాండ్ తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాడు. మహారాష్ట్ర ననుంచి ఓ లోక్ సభ నాయకుడిని బెలగావి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తొలిసారిగా సరిహద్దు వివాదంపై కేంద్ర హోం శాఖ మంత్రి మధ్యవర్తిత్వం వహించారని.. ఈ సమస్ను పరిష్కరిస్తారని అన్నారు. సరిహద్దు సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఉపముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ అన్నారు.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Andhra Pradesh: కేంద్రం కీలక ప్రకటన.. రూ.106 కోట్లతో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు
ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య చిచ్చురేపుతోంది. ఇటీవల కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో దాడి జరిగింది. ఇదే విధంగా కర్ణాటకలో కూడా మహారాష్ట్ర వాహనాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెలగావి కర్ణాటకలో చేరింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై వివాదం చెలరేగుతూనే ఉంది. మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!