Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Samyukt Kisan Morcha Wrote Letter To Pm Narendra Modi

ప్ర‌ధాని మోడీకి “సంయుక్త కిసాన్ మోర్చా” లేఖ…

NTV Telugu Twitter
Published Date :November 22, 2021 , 9:07 am
By Manohar
ప్ర‌ధాని మోడీకి “సంయుక్త కిసాన్ మోర్చా” లేఖ…
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలోని కోట్లాది మంది రైతులకు నవంబర్ 19 వ తేదీ ఉదయం దేశానికి మీ సందేశాన్ని వినిపించారు. మొత్తం 11 సార్లు చర్చలు జరిపిన తర్వాత ద్వైపాక్షిక పరిష్కారం కాకుండా ఏకపక్ష ప్రకటన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, మీరు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా మీ ప్రభుత్వం ఈ హామీని నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం,” అని లేఖ‌లో పేర్కొన్నారు “ఎస్‌కెఎం”. రైతు ఉద్యమం లక్ష్యం, డిమాండ్ “కేవలం మూడు న‌ల్ల‌ చట్టాలను రద్దు చేయడమే కాదని” మీకు బాగా తెలుసు. ప్రభుత్వంతో చర్చల ప్రారంభం నుంచి కూడా “సంయుక్త‌ కిసాన్ మోర్చా” మరో మూడు డిమాండ్లను చేసింది” అని లేఖలో పేర్కొంది “ఎస్‌కెఎం”.

“ఎస్‌కెఎం” అదనంగా పునరుద్ఘాటించిన మూడు అంశాలు

  1. “మొత్తం సాగు ఖర్చు (సి2+50 శాతం) ఆధారంగా “కనీస మద్దతు ధర” ను అన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రైతులందరికీ చట్టబద్ధమైన హక్కును కల్పించాలి.

• తద్వారా దేశంలోని ప్రతి రైతు కు “కనీస మద్దతు ధర” తప్పనిసరిగా లభించే భరోసా ప్రభుత్వం కల్పించాలి. (మీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ సిఫార్సును 2011లో అప్పటి ప్రధానికి అందించింది. ఆ మేరకు, మీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన కూడా చేసింది).

  1. “ప్రభుత్వం ప్రతిపాదించిన “విద్యుత్ చట్టం సవరణ బిల్లు-2020, 2021″ ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతుల‌కు ప్ర‌భుత్వానికి జ‌రిగిన చర్చల సమయంలో దానిని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దానిని ధిక్కరిస్తూ పార్లమెంటు ఎజెండాలో చేర్చింది”.
  2. “క్యాపిటల్ రీజియన్, అనుబంధ ప్రాంతాల్లో “కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటి మేనేజ్‌మెంట్ యాక్ట్- 2021” లో రైతులకు శిక్ష విధించే నిబంధనలను తొలగించాలి. ఈ ఏడాది ప్రభుత్వం కొన్ని రైతు వ్యతిరేక నిబంధనలను తొలగించింది. కానీ మరలా సెక్షన్ 15 ద్వారా రైతులకు శిక్ష విధించే నిబంధ‌నను చేర్చింది”.

• “మీ ప్ర‌సంగంలో రైతులు చేసిన ఈ మూడు ప్రధాన డిమాండ్లపై ఖచ్చితమైన ప్రకటన లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ చారిత్రాత్మక ఉద్యమం ద్వారా మూడు చట్టాల రద్దు మాత్రమే కాకుండా, కష్టపడి పండించిన పంటకు లాభదాయకమైన ధర లభిస్తుందనే హామీ ఇస్తారని రైతులు ఆశించారు”.

చారిత్రాత్మక ఉద్యమం కొనసాగుతున్న క్రమంలోనే మరికొన్ని సమస్యలను కూడా
పరిష్కరించాలని డిమాండ్ చేసినట్లు” లేఖ‌లో ప్రస్తావించింది “ఎస్‌కెఎం”.

• రైతు ఉద్యమంలో (జూన్ 2020 నుండి ఇప్పటి వరకు) ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌తో స‌హా అనేక ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై వందలాది కేసులు పెట్టారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

• లఖింపూర్ ఖేరీ హత్యకేసు సూత్రధారి, సెక్షన్ 120బిలో నిందితుడైన అజయ్ మిశ్రా ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతూ మీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. మీతో పాటు ఇతర సీనియర్ మంత్రులతో కూడా వేదిక పంచుకుంటున్నారు. అతన్ని బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి.

• రైతు ఉద్యమంలో ఇప్పటివరకు సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పించే వ్యవస్థ ఉండాలి. అమరవీరులైన రైతుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించేందుకు సింఘూ సరిహద్దులో భూమి ఇవ్వాలి.

“మీరు రైతులు ఇంటికి తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వీధుల్లో రోడ్ల‌పై కూర్చోవడం మాకు కూడా ఇష్టం లేదు. మేము మీకు హామీ ఇస్తున్నాం. ఈ ఆరు అంశాలను, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించిన తర్వాత, సత్వరమే మేము మా ఇళ్ల‌కి, కుటుంబాలకు, వ్యవసాయం చేసుకునేందుకు తిరిగి వెళ్లాల‌ని కోరుకుంటున్నాం. మీరు కూడా అదే కావాలని కోరుకుంటున్నట్లయుతే, పైన పేర్కొన్న ఆరు అంశాలపై ప్రభుత్వం వెంటనే “ఎస్‌కెఎం”తో చర్చలు పునఃప్రారంభించాలి. అప్పటి వరకు “ఎస్‌కెఎం” ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది” అని ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ‌లో పేర్కొంది “ఎస్‌కెఎం”.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • PM Narendra Modi
  • Samyukt Kisan Morcha
  • SKM letter

తాజావార్తలు

  • Off The Record: వైసీపీ అధిష్టానం ఆ విషయంలో ఎందుకు తికమక పడుతుంది..?

  • Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?

  • Neha Sharma : ఘాటు అందాలతో రెచ్చిపోయిన నేహాశర్మ..

  • Off The Record: పలాసలో రగులుతున్న పొలిటికల్ కొలిమి

  • Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions