Sambhal Violence: యోగితో అట్లుంటది.. సంభాల్ హింసకు పాల్పడి వారి నుంచి నష్టపరిహారం..
- సంభాల్లో ఇటీవల హింసాత్మక దాడి..
- మసీదు సర్వేని అడ్డుకున్న గుంపు..
- రాళ్ల దాడి చేసిన వారి నుంచి రికవరీ చేసేందుకు యూపీ సర్కార్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్ నగరం తీవ్రమైన హింసతో అట్టుడికింది. స్థానిక షాహీ జామా మసీదు సర్వేకు వెళ్లిన వారిపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. పోలీసులు, ఇతర అధికారులపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయాల్సివచ్చింది. ఈ హింసలో నలుగురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. వాహనాలు, స్థానికులు ఇళ్లను గుంపు ధ్వంసం చేసింది. సంభాల్లోని జామా మసీదు ఒకప్పటి హరిహర్ ఆలయమని హిందూ పక్షం కేసు ఫైల్ చేయడంతో, కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Maharashtra CM: కొనసాగుతున్న ‘‘మహా’’ సస్పెన్స్.. సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే రాళ్లదాడి చేసిన వారి పోస్టర్లను ప్రదర్శించేందుకు యూపీ సర్కార్ సిద్ధమైనట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. ‘‘సంభాల్ హింసాకాండలో పాల్గొన్న వ్యక్తులకు వ్యతిరేకంగా UP ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబిస్తోంది. రాళ్లదాడికి పాల్పడిన సంఘవిద్రోహ శక్తుల పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శిస్తాము. నష్టపరిహారాన్ని రికవరీ చేస్తాము. వారి అరెస్టు కోసం సహకరించిన వారికి రివార్డు కూడా ఇస్తాము’’ అని యూపీ అదికార ప్రతినిధి వెల్లడించారు.
యూపీ సర్కార్ 2020లో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొని విధ్వంసాన్ని సృష్టించిన వ్యక్తుల పోస్టర్లను కూడా ఇలాగే ప్రదర్శించారు. అయితే, కోర్టు ఆదేశాలతో వీటిని తర్వాత తొలగించారు. సంభాల్ హింసలో ఇప్పటి వరకు 25 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. 7 ఏఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సమాజ్వాదీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహ్మద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్తో సహా 2750 మంది గుర్తుతెలియని అనుమానితులపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!