Samajwadi Party: బాబ్రీ మసీదుపై వివాదం.. ప్రతిపక్ష కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీ బయటకు..
- ఎంవీఏ నుంచి బయటకు వచ్చిన సమాజ్వాదీ పార్టీ..
- బాబ్రీ మసీదు కూల్చివేతపై ఉద్ధవ్ సన్నిహితుడి వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajwadi Party: బాబ్రీ మసీదు కూల్చివేతపై ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో విభేదాలకు కారణమైంది. ఈ వ్యాఖ్యల కారణంగా కూటమిలోని ‘‘సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)’’ ఎంవీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. బాబ్రీ మసీదును కూల్చివేత 32వ వార్షికోత్సవం సందర్భంగా శివసేన(ఠాక్రే) నేత మిలింద్ నార్వేకర్ మసీదు ఫోటోని పోస్ట్ చేశారు. శివసేన పితామహుడు బాలాసాహెబ్ ఠాక్రే ఫోటోని పోస్ట్ చేసి ‘‘ ఇది చేసిన వారిని చూసి నేను గర్వపడుతున్నాను’’ అని ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే చిత్రాలను పోస్ట్ చేశారు.
ఈ పరిణామం ఎంవీఏలో చీలికలకు కారణమైంది. మహారాష్ట్రలో సమాజ్వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, ఎన్సీపీ శరద్ పవార్ల పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిని ధిక్కరించి ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అసిమ్ అజ్మీ, రైస్ షేక్ ఇద్దరు ప్రమాణస్వీకారం చేశారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
‘‘బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని అభినందిస్తూ శివసేన (UBT) ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. అతని (ఉద్ధవ్ థాకరే) సహాయకుడు కూడా మసీదు కూల్చివేతను అభినందిస్తూ X లో పోస్ట్ చేశాడు’’ అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అజ్మీ చెప్పాడు. తాము ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్కి కూడా చెప్పామని, కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ కూటమిలో ఎవరైనా ఇలాంటి భాష మాట్లాడితే, వారికి బీజేపీకి మధ్య తేడా ఏంటి..? వారితో మేము ఎందుకు ఉండాలి..? అని ఎస్పీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమతమైంది. కాంగ్రెస్-16, ఉద్ధవ్ సేన -20, ఎన్సీపీ శరద్ పవార్-10 సీట్లు ఇతర పార్టీలు మరో 3 సీట్లను మాత్రమే సాధించాయి. అయితే, ఈవీఎంలో మోసాల వల్లే బీజేపీ కూటమి గెలిచిందంటూ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు. ఇది మహారాష్ట్ర ప్రజల ఆదేశం కాదని, ఈవీఎంలు, ఎన్నికల సంఘం ఆదేశం అని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు.
— Milind Narvekar (@NarvekarMilind_) December 5, 2024
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!