Site icon NTV Telugu

Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం

Akhilesh Yadav

Akhilesh Yadav

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు. ‘‘దేశంలో మూడవ అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రతిపక్షంలో లేవనెత్తిన ప్రతి గొంతును అణచివేయాలని చూస్తోంది.’’ అని ఎక్స్‌లో ఫక్రుల్ హసన్ చాంద్ పేర్కొన్నారు. ఖాతా పునరుద్ధరించకపోతే పార్టీ చట్టపరంగా ముందుకెళ్తుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి

అయితే అఖిలేష్ ఫేస్‌బుక్ ఖాతాలో హింసాత్మక, లైంగిక కంటెంట్‌ను పోస్ట్ చేయడంపై ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచారం. అఖిలేష్‌కు ఫేస్‌బుక్‌లో 8 మిలియన్లకు పైగా అనుచరులుు ఉన్నారు. ఈ ఖాతాను శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హఠాత్తుగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఖాతా క్లోజ్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. దేశంలో మూడో అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్ ఖాతాను క్లోజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ పేర్కొన్నారు. బీజేపీ ఇలా చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు. ఇది అధికార పార్టీ ఆదేశం మేరకు జరిగి ఉంటే పిరికితనానికి సంకేతం అన్నారు. సోషలిస్టుల గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం పొరపాటు అని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: US: అమెరికాలోని ఓ ప్లాంట్‌లో పేలుడు.. 19 మంది మృతి!

అయినా ఎటువంటి హెచ్చరికా.. నోటీసు లేకుండా ఫేస్‌బుక్ ఖాతాను ఎలా క్లోజ్ చేస్తుందని లక్నో నార్త్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా శుక్లా ధ్వజమెత్తారు. ఫేస్‌బుక్ తన పరిమితులను దాటడానికి ధైర్యం చేసిందని మండిపడ్డారు. ‘‘అఖిలేష్ యాదవ్ లక్షలాది మంది గొంతుక! ఫేస్‌బుక్ తన సరిహద్దులను గుర్తుంచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దం చేయకూడదు. సమాజ్‌వాదీలారా.. ఫేస్‌బుక్‌ను దాని పరిధిని గుర్తుచేయాల్సిన సమయం ఆసన్నమైంది! ఇటువంటి అహంకారాన్ని సహించబోము.’’ అని శుక్లా అన్నారు.

Exit mobile version