India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
- సంక్షోభం వేళ భారత్కు అండగా రష్యా..
- భారత్ ఇంధన భద్రతకు హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ‘‘ఇంధన సంక్షోభం’’ లోకి నెట్టింది. భారత్తో సహా అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానితో సహా, రక్షణ మంత్రి, పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు.
ఇలాంటి సంక్షోభం మధ్య మరోసారి మిత్రదేశం రష్యా భారత్కు అండగా ముందుకు వచ్చింది. ఇంధన సరఫరాకు సంబంధించిన అన్ని ఒప్పందాలు ఏ పరిస్థితుల్లోనైనా నెరవేర్చబడుతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రయోజనాలకు ఏ విధంగా హాని కలిగించకుండా రష్యా చూసుకుంటుందని లావ్రోవ్ హామీ ఇచ్చారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కోసం ఆయన భారత పర్యటనకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలు అత్యంత బలంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య గాఢమైన స్నేహం ఉందని చెప్పారు. భారత్-రష్యలు విడిపోయే పరిస్థితి ఏదీ తలెత్తదని అన్నారు.
Also Read
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Read Also: Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
ఇంధన సరఫరా విషయంలో భారతదేశానికి రష్యా తన బాధ్యతల్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. రష్యా సరఫరా వల్ల భారత ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదని తాను హామీ ఇస్తున్నానని, అన్యాయమైన, నిజాయితీ లేని పోటీ మన ఒప్పందాలకు హాని కలిగించకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని, భారత్కు గ్యాస్, చమురు, బొగ్గు వంటి హైడ్రోకార్బన్లను సరఫరా చేస్తూనే ఉన్నామని, భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలపడుతుందని చెప్పారు.
కొన్ని శక్తులు రష్యా-భారత్ సంబంధాలను దెబ్బతీసి తమ నియమాలను రద్దుడానికి ప్రయత్నిస్తూన్నాయని, అయితే వారి ప్రయత్నాలు విఫలమవుతాయని లావ్రోవ్ అన్నారు. రెండు దేశాలు వీటిని గమనిస్తున్నాయని, ఇదే తమ స్నేహాన్ని మరింత బలంగా చేస్తుందని చెప్పారు. రష్యా సాంకేతికతతో తమిళనాడు కుడంకుళంలో నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రం తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ శక్తివంతమైన నేతగా ఆయన అభివర్ణించారు.
తాజావార్తలు
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!