India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
- సంక్షోభం వేళ భారత్కు అండగా రష్యా..
- భారత్ ఇంధన భద్రతకు హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ‘‘ఇంధన సంక్షోభం’’ లోకి నెట్టింది. భారత్తో సహా అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానితో సహా, రక్షణ మంత్రి, పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు.
ఇలాంటి సంక్షోభం మధ్య మరోసారి మిత్రదేశం రష్యా భారత్కు అండగా ముందుకు వచ్చింది. ఇంధన సరఫరాకు సంబంధించిన అన్ని ఒప్పందాలు ఏ పరిస్థితుల్లోనైనా నెరవేర్చబడుతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రయోజనాలకు ఏ విధంగా హాని కలిగించకుండా రష్యా చూసుకుంటుందని లావ్రోవ్ హామీ ఇచ్చారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కోసం ఆయన భారత పర్యటనకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలు అత్యంత బలంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య గాఢమైన స్నేహం ఉందని చెప్పారు. భారత్-రష్యలు విడిపోయే పరిస్థితి ఏదీ తలెత్తదని అన్నారు.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
Read Also: Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
ఇంధన సరఫరా విషయంలో భారతదేశానికి రష్యా తన బాధ్యతల్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. రష్యా సరఫరా వల్ల భారత ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదని తాను హామీ ఇస్తున్నానని, అన్యాయమైన, నిజాయితీ లేని పోటీ మన ఒప్పందాలకు హాని కలిగించకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని, భారత్కు గ్యాస్, చమురు, బొగ్గు వంటి హైడ్రోకార్బన్లను సరఫరా చేస్తూనే ఉన్నామని, భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలపడుతుందని చెప్పారు.
కొన్ని శక్తులు రష్యా-భారత్ సంబంధాలను దెబ్బతీసి తమ నియమాలను రద్దుడానికి ప్రయత్నిస్తూన్నాయని, అయితే వారి ప్రయత్నాలు విఫలమవుతాయని లావ్రోవ్ అన్నారు. రెండు దేశాలు వీటిని గమనిస్తున్నాయని, ఇదే తమ స్నేహాన్ని మరింత బలంగా చేస్తుందని చెప్పారు. రష్యా సాంకేతికతతో తమిళనాడు కుడంకుళంలో నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రం తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ శక్తివంతమైన నేతగా ఆయన అభివర్ణించారు.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!