Rent Problems: కాంగ్రెస్ నేతలకు అద్దె కట్టే డబ్బుల్లేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వివిధ రాజకీయపార్టీ అధికార నివాసాలు, పార్టీ కార్యాలయాల అద్దెలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయిపడింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పలువురు నాయకులతో పాటు పార్టీల కార్యాలయాలకు అద్దెలు చెల్లించడంలో అలసత్వం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీతో పాటు… దాని అధినేత్రి సోనియా గాంధీ కూడా దీనికి మినహాయింపు కాదని తేలిపోయింది. సోనియా గాంధీ తన అధికారిక నివాసానికి అద్దె చెల్లించలేదు. జన్పథ్ రోడ్డులోని నివాసముంటున్న ఆమె… 4 వేల 610 రూపాయల అద్దె బకాయి ఉన్నారు. అయితే, 2020 సెప్టెంబర్లో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో అద్దె కట్టారు. ఆ తర్వాత అద్దె చెల్లించలేదు. అలాగే సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉంటున్న ఇంటికి కూడా 2013 తర్వాత అద్దె చెల్లించలేదు. చాణక్యపురిలో గల ఆ బంగ్లాకు 5 లక్షల 8 వేల రూపాయల అద్దె బకాయి ఉంది.
Also Read
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పదేళ్ళుగా అద్దె చెల్లించడం లేదు. 2012 తర్వాత అద్దె చెల్లించలేదట. దీంతో 12 లక్షల 70 వేల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు మూడేళ్ల పాటు వసతి సౌకర్యం ఉంటుంది. తర్వాత ఆ పార్టీలు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసి, సొంతంగా కార్యాలయాల్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది.
2010 జూన్లోనే ఢిల్లీ రౌజ్ ఎవెన్యూలో కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయింపు జరిగింది. కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. 2013లోనే అక్బర్ రోడ్డులోని కార్యాలయంతో పాటు, మరో రెండు భవనాలను కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉంది. కానీ, పొడిగింపు వెసులుబాటును పలుమార్లు ఉపయోగించుకుంది ఆ పార్టీ. అలాగే 2020లో లోధి రోడ్డులోని బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి నోటీసులు పంపారు అధికారులు.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!