Namaz Controversy: క్యాంపస్లో నమాజ్ చదివిన విద్యార్థులు.. రాజుకున్న వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Row After 2 Students Offer Namaz Inside Gujarat Varsity Campus: గుజరాత్లోని ఒక యూనివర్శిటీలో ఇద్దరు విద్యార్థులు నమాజ్ చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (MSU) క్యాంపస్లో వాళ్లు నమాజ్ చదివిన వీడియో బయటకు రావడమే ఆలస్యం.. ఒక్కసారిగా వివాదం రాజుకుంది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగి.. క్యాంపస్లో నమాజ్ చదవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఎక్కడైనా నమాజ్ చదివారో, ఆ ప్రదేశంలో గంగాజలం చల్లారు. రామ్-ధున్ నిర్వహించి, వర్శిటీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించారు.
MP Pragya Thakur: ఇళ్లల్లో కత్తులు ఉంచుకోండి.. ఎప్పుడైనా అవసరం పడుతుంది
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
సోమవారం ఉదయం క్యాంపస్లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో ఇద్దరు యువకులు నమాజ్ చేసిన ఒక వీడియో బయటకు వచ్చింది. వాళ్లు నమాజ్ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే.. వర్శిటీ విజిలెన్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే.. వర్శిటీ భవనంలో పరీక్షలు జరుగుతున్నందున శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుల్ని పిలిపించామని ఆ వర్శిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లకులీష్ త్రివేది తెలిపారు. నమాజ్ చదివిన ఆ ఇద్దరు విద్యార్థులకు బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారని, పరీక్షలు రాడానికి వచ్చిన వాళ్లు లోపలికి వెళ్లే ముందు నమాజ్ చదివారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత వర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వారికి కౌన్సిలింగ్ ఇస్తుందని, వర్శిటీల్లో నమాజ్ చదవకూడదన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్తారని చెప్పారు.
Mock Drill: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. సంసిద్ధంగా గాంధీ హాస్పిటల్
మరోవైపు.. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ, విద్యార్థులు ఇలా విద్యా క్యాంపస్లలో నమాజ్ చదవకూడదన్నారు. విద్యాసంస్థలు పుణ్యప్రదమైనవని, అలాంటి పనులు చేయడం మానుకోవాలని కోరారు. అయితే.. విశ్వహిందూ పరిషత్కి చెందిన విష్ణు ప్రజాపతి అనే లీడర్ మాత్రం ఇలాంటి ఘటనలు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ హిందువులకు సవాల్ విసురుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. క్యాంపస్లో భద్రతను కఠినతరం చేయాలని తాము మెమొరండం అందజేస్తామని చెప్పారు.
Woman SI Affair: డ్రైవర్తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!