Abdul Siddiqui: భారతదేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJD leader Abdul Siddiqui on Muslims feeling insecure in India: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. బీహార్ మాజీ మంత్రి అయిన సిద్ధిఖీ.. తన కొడుకు, కూతుర్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని, వీలైతే అక్కడే పౌరసత్వం కూడా ఇప్పించాలని కోరానని సిద్ధిఖీ అన్నారు.
గత వారం బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జేడీ నేత మాట్లాడుతూ.. నా కుమారుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడని.. నా కూతురు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పట్టా పొందిందని అన్నారు. అయితే వీళ్లిద్దరికి అక్కడే ఉద్యోగం చేయాలని.. వీలయితే అక్కడే పౌరసత్వం పొందాలని చెప్పానని అన్నారు.
Also Read
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
- Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
భారతదేశంలో ఉన్న వాతావరణాన్ని భరించగలరో లేదో నాకు తెలియదని వారికి చెప్పానని అబ్దుల్ బారీ సిద్ధికీ అన్నారు. ఒక మనిషి తన పిల్లలను మాతృభూమిని విడిచిపెట్టమని చెప్పడం ఎంత బాధకరమో మీరు అర్థం చేసుకోవచ్చంటూ.. కానీ అలాంటి సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 17న బీహార్ కౌన్సిల్ చైర్మన్ దేవేష్ చంద్ర ఠాకూర్ను సన్మానించేందుకు దైనిక్ ప్యారీ ఉర్దూ నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధిఖీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!