Rishabh Pant: అక్క.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలెయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Request Urvashi Rautela To Leave Him Alone: క్రికెటర్ రిషభ్ పంత్, నటి ఊర్వశీ రౌతేలా వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే! వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారో లేదో ఎవ్వరికీ క్లారిటీ లేదు కానీ, మీడియాలో మాత్రం తెగ కథనాలు వస్తుంటాయి. నెటిజన్లు సైతం ఈ జోడీపై సోషల్ మీడియాలో ఏదో జోకులు వేసుకుంటూనే ఉంటారు. ఈ ఇద్దరికి సంబంధించి ఏదైనా సందర్భం వస్తే చాలు.. లింక్ పెట్టేసి, నెట్టింట్లో తెగ ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు మీడియా ఊరికే ఉంటుందా? తారస పడినప్పుడల్లా గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధిస్తుంది. ఊర్వశీ రౌతేలాకు రీసెంట్ ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో.. ‘నన్ను ఒంటరిగా వదిలెయ్ అక్క’ అంటూ రిషభ్ పంత్ ఘాటుగానే బదులిచ్చాడు.
ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏముంది? ‘‘గతంలో వారణాసిలో షూటింగ్ ముగించుకొని, ఒక షో కోసం నేను ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి వచ్చాను. రోజంతా షూట్ చేసి నేను చాలా అలసిపోయాను. అనంతరం రెడీ అవ్వడానికి కాస్త టైం పట్టింది. మీకు తెలిసిందేగా.. అమ్మాయిలు రెడీ అవ్వడానికి సమయం పడుతుందని. అప్పుడే మిస్టర్ ఆర్పీ (RP) నాకోసం వచ్చి, లాబీలో కూర్చున్నారు. కేవలం నన్ను కలవడానికి అక్కడికి వచ్చారు. నేను రెడీ అవుతూ అవుతూ.. అనుకోకుండా నిద్రలోకి జారుకున్నా. షూట్ కారణంగా అలసిపోవడం వల్లే నిద్రపోయా. ఆ సమయంలో నా ఫోన్కు చాలా కాల్స్ వచ్చాయి. కానీ, నేను లిఫ్ట్ చేయలేకపోయా. తీరా లేచి చూసిన తర్వాత 16-17 మిస్డ్ కాల్స్ ఉండడాన్ని గమనించాను. అది చూసి నేను చాలా బ్యాడ్గా ఫీలయ్యా. నాకోసం ఒకరు వేచి చూస్తుంటే, నేను కలవలేకపోయానన్న విషయం నన్ను కలచివేసింది. దీంతో, ముంబైలో కలుద్దామని ఆర్పీకి చెప్పాను’’ అంటూ ఆ ఇంటర్వ్యూలో ఊర్వశీ తెలిపింది. ఇందులో ఆమె పేర్కొన్న ఆర్పీ మరెవ్వరో కాదు.. రిషభ్ పంత్. దీంతో, ఈ వీడియోని నెటిజన్లు వైరల్ చేసేశారు.
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ఇది తన దృష్టికి రావడంతో.. రిషభ్ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘పాపులారిటీ కోసం, హెడ్లైన్స్లో రావడం కోసం కొందరు చేసే దిగజారుడు వ్యాఖ్యలు చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఫేమ్ కోసం మరీ ఇంత తాపత్రయ పడే వాళ్లని చూస్తే జాలేస్తుంది. దేవుడు వారిపై కరుణ చూపించాలని కోరుకుంటున్నా’’ అంటూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ వేశాడు. అంతేకాదు.. ఈ స్టోరీకి #merapichachorhoBehen (నన్ను ఒంటరిగా వదిలెయ్ అక్క), #jhutkibhilimithotihai (అబద్ధం ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది) అంటూ రెండు క్యాప్షన్లు పెట్టాడు. అయితే.. అతడు పెట్టిన పది నిమిషాల్లోనే ఈ స్టోరీని తొలగించడం గమనార్హం. అయితే.. ఈలోపే ఇది వైరల్ అయిపోయింది. మరి, ఇందుకు ఊర్వశీ రౌతేలా ఎలా బదులిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!