Rishabh Pant: అక్క.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలెయ్
Rishabh Pant Request Urvashi Rautela To Leave Him Alone: క్రికెటర్ రిషభ్ పంత్, నటి ఊర్వశీ రౌతేలా వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే! వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారో లేదో ఎవ్వరికీ క్లారిటీ లేదు కానీ, మీడియాలో మాత్రం తెగ కథనాలు వస్తుంటాయి. నెటిజన్లు సైతం ఈ జోడీపై సోషల్ మీడియాలో ఏదో జోకులు వేసుకుంటూనే ఉంటారు. ఈ ఇద్దరికి సంబంధించి ఏదైనా సందర్భం వస్తే చాలు.. లింక్ పెట్టేసి, నెట్టింట్లో తెగ ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నప్పుడు మీడియా ఊరికే ఉంటుందా? తారస పడినప్పుడల్లా గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధిస్తుంది. ఊర్వశీ రౌతేలాకు రీసెంట్ ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో.. ‘నన్ను ఒంటరిగా వదిలెయ్ అక్క’ అంటూ రిషభ్ పంత్ ఘాటుగానే బదులిచ్చాడు.
ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏముంది? ‘‘గతంలో వారణాసిలో షూటింగ్ ముగించుకొని, ఒక షో కోసం నేను ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి వచ్చాను. రోజంతా షూట్ చేసి నేను చాలా అలసిపోయాను. అనంతరం రెడీ అవ్వడానికి కాస్త టైం పట్టింది. మీకు తెలిసిందేగా.. అమ్మాయిలు రెడీ అవ్వడానికి సమయం పడుతుందని. అప్పుడే మిస్టర్ ఆర్పీ (RP) నాకోసం వచ్చి, లాబీలో కూర్చున్నారు. కేవలం నన్ను కలవడానికి అక్కడికి వచ్చారు. నేను రెడీ అవుతూ అవుతూ.. అనుకోకుండా నిద్రలోకి జారుకున్నా. షూట్ కారణంగా అలసిపోవడం వల్లే నిద్రపోయా. ఆ సమయంలో నా ఫోన్కు చాలా కాల్స్ వచ్చాయి. కానీ, నేను లిఫ్ట్ చేయలేకపోయా. తీరా లేచి చూసిన తర్వాత 16-17 మిస్డ్ కాల్స్ ఉండడాన్ని గమనించాను. అది చూసి నేను చాలా బ్యాడ్గా ఫీలయ్యా. నాకోసం ఒకరు వేచి చూస్తుంటే, నేను కలవలేకపోయానన్న విషయం నన్ను కలచివేసింది. దీంతో, ముంబైలో కలుద్దామని ఆర్పీకి చెప్పాను’’ అంటూ ఆ ఇంటర్వ్యూలో ఊర్వశీ తెలిపింది. ఇందులో ఆమె పేర్కొన్న ఆర్పీ మరెవ్వరో కాదు.. రిషభ్ పంత్. దీంతో, ఈ వీడియోని నెటిజన్లు వైరల్ చేసేశారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇది తన దృష్టికి రావడంతో.. రిషభ్ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘పాపులారిటీ కోసం, హెడ్లైన్స్లో రావడం కోసం కొందరు చేసే దిగజారుడు వ్యాఖ్యలు చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఫేమ్ కోసం మరీ ఇంత తాపత్రయ పడే వాళ్లని చూస్తే జాలేస్తుంది. దేవుడు వారిపై కరుణ చూపించాలని కోరుకుంటున్నా’’ అంటూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ వేశాడు. అంతేకాదు.. ఈ స్టోరీకి #merapichachorhoBehen (నన్ను ఒంటరిగా వదిలెయ్ అక్క), #jhutkibhilimithotihai (అబద్ధం ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది) అంటూ రెండు క్యాప్షన్లు పెట్టాడు. అయితే.. అతడు పెట్టిన పది నిమిషాల్లోనే ఈ స్టోరీని తొలగించడం గమనార్హం. అయితే.. ఈలోపే ఇది వైరల్ అయిపోయింది. మరి, ఇందుకు ఊర్వశీ రౌతేలా ఎలా బదులిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!