Kerala High Court: వివాహ రిజిస్ట్రేషన్కు “మతం” ప్రాతిపదిక కాదు..
Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన కారణం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఇద్దరికి పెళ్లి జరిగిందా..? లేదా? అనేది మాత్రమే ముఖ్యం అని తెలిపింది.
కేరళ వివాహ నమోదు నిబంధనలు 2008 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడానికి మతం ప్రాతిపదిక కాదని పేర్కొంది.. వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మహిళ తల్లి ముస్లిం అయినందున, హిందూ యువకుడితో వివాహాన్ని నమోదు చేయలేమన్న ప్రభుత్వ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Chandramukhi 2: చంద్రముఖి2 కోసం రంగంలోకి కాజల్ అగర్వాల్..?
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఉదయమ్ పేరూర్ లో పీఆర్ లాలన్, ఐషా నివసిస్తున్నారు. ఈ జంట డిసెంబర్ 2, 2021లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొచ్చి కార్పొరేషన్ సెక్రటరీకి తన వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐషా తల్లి ముస్లిం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం కింద మాత్రమే వారి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చని అధికారులు వీరిద్దరికి తెలియజేశారు.
దీనిపై లాలన్-ఐషా దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2008లో అమలులోకి వచ్చిన వివాహ నమోదు నిబంధనలను మహిళలు, పిల్లల హక్కు పరిరక్షణ కోసం రూపొందించామని పేర్కొంది కేరళ హైకోర్టు పేర్కొంది. అందువల్ల దంపతుల తల్లిదండ్రులు రెండు మతాలకు చెందిన వారు కావడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేయకపోవడం సరైనది కాదని పేర్కొంది. వివాహం జరిగిందా లేదా అనేదే ముఖ్యమని కోర్టు పేర్కొంది. హైకోర్టు తన ఉత్తర్వులను స్థానిక స్వపరిపాలన కార్యదర్శకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!