Kerala High Court: వివాహ రిజిస్ట్రేషన్కు “మతం” ప్రాతిపదిక కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన కారణం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఇద్దరికి పెళ్లి జరిగిందా..? లేదా? అనేది మాత్రమే ముఖ్యం అని తెలిపింది.
కేరళ వివాహ నమోదు నిబంధనలు 2008 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడానికి మతం ప్రాతిపదిక కాదని పేర్కొంది.. వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మహిళ తల్లి ముస్లిం అయినందున, హిందూ యువకుడితో వివాహాన్ని నమోదు చేయలేమన్న ప్రభుత్వ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్.
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
Read Also: Chandramukhi 2: చంద్రముఖి2 కోసం రంగంలోకి కాజల్ అగర్వాల్..?
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఉదయమ్ పేరూర్ లో పీఆర్ లాలన్, ఐషా నివసిస్తున్నారు. ఈ జంట డిసెంబర్ 2, 2021లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొచ్చి కార్పొరేషన్ సెక్రటరీకి తన వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐషా తల్లి ముస్లిం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం కింద మాత్రమే వారి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చని అధికారులు వీరిద్దరికి తెలియజేశారు.
దీనిపై లాలన్-ఐషా దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2008లో అమలులోకి వచ్చిన వివాహ నమోదు నిబంధనలను మహిళలు, పిల్లల హక్కు పరిరక్షణ కోసం రూపొందించామని పేర్కొంది కేరళ హైకోర్టు పేర్కొంది. అందువల్ల దంపతుల తల్లిదండ్రులు రెండు మతాలకు చెందిన వారు కావడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేయకపోవడం సరైనది కాదని పేర్కొంది. వివాహం జరిగిందా లేదా అనేదే ముఖ్యమని కోర్టు పేర్కొంది. హైకోర్టు తన ఉత్తర్వులను స్థానిక స్వపరిపాలన కార్యదర్శకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!