Kerala High Court: వివాహ రిజిస్ట్రేషన్కు “మతం” ప్రాతిపదిక కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన కారణం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఇద్దరికి పెళ్లి జరిగిందా..? లేదా? అనేది మాత్రమే ముఖ్యం అని తెలిపింది.
కేరళ వివాహ నమోదు నిబంధనలు 2008 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడానికి మతం ప్రాతిపదిక కాదని పేర్కొంది.. వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మహిళ తల్లి ముస్లిం అయినందున, హిందూ యువకుడితో వివాహాన్ని నమోదు చేయలేమన్న ప్రభుత్వ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్.
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
Read Also: Chandramukhi 2: చంద్రముఖి2 కోసం రంగంలోకి కాజల్ అగర్వాల్..?
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఉదయమ్ పేరూర్ లో పీఆర్ లాలన్, ఐషా నివసిస్తున్నారు. ఈ జంట డిసెంబర్ 2, 2021లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొచ్చి కార్పొరేషన్ సెక్రటరీకి తన వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐషా తల్లి ముస్లిం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం కింద మాత్రమే వారి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చని అధికారులు వీరిద్దరికి తెలియజేశారు.
దీనిపై లాలన్-ఐషా దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2008లో అమలులోకి వచ్చిన వివాహ నమోదు నిబంధనలను మహిళలు, పిల్లల హక్కు పరిరక్షణ కోసం రూపొందించామని పేర్కొంది కేరళ హైకోర్టు పేర్కొంది. అందువల్ల దంపతుల తల్లిదండ్రులు రెండు మతాలకు చెందిన వారు కావడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేయకపోవడం సరైనది కాదని పేర్కొంది. వివాహం జరిగిందా లేదా అనేదే ముఖ్యమని కోర్టు పేర్కొంది. హైకోర్టు తన ఉత్తర్వులను స్థానిక స్వపరిపాలన కార్యదర్శకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!