Kerala High Court: వివాహ రిజిస్ట్రేషన్కు “మతం” ప్రాతిపదిక కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Religion no basis for registering marriage, says Kerala High court: మతాంతర వివాహం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని ఓ హిందూ జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాాలు జారీ చేసింది. దంపతుల తల్లిదండ్రులు వేరే మతానికి చెందిన వారు కావడంతో వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం సరైన కారణం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఇద్దరికి పెళ్లి జరిగిందా..? లేదా? అనేది మాత్రమే ముఖ్యం అని తెలిపింది.
కేరళ వివాహ నమోదు నిబంధనలు 2008 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడానికి మతం ప్రాతిపదిక కాదని పేర్కొంది.. వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మహిళ తల్లి ముస్లిం అయినందున, హిందూ యువకుడితో వివాహాన్ని నమోదు చేయలేమన్న ప్రభుత్వ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Chandramukhi 2: చంద్రముఖి2 కోసం రంగంలోకి కాజల్ అగర్వాల్..?
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఉదయమ్ పేరూర్ లో పీఆర్ లాలన్, ఐషా నివసిస్తున్నారు. ఈ జంట డిసెంబర్ 2, 2021లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొచ్చి కార్పొరేషన్ సెక్రటరీకి తన వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐషా తల్లి ముస్లిం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం కింద మాత్రమే వారి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చని అధికారులు వీరిద్దరికి తెలియజేశారు.
దీనిపై లాలన్-ఐషా దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2008లో అమలులోకి వచ్చిన వివాహ నమోదు నిబంధనలను మహిళలు, పిల్లల హక్కు పరిరక్షణ కోసం రూపొందించామని పేర్కొంది కేరళ హైకోర్టు పేర్కొంది. అందువల్ల దంపతుల తల్లిదండ్రులు రెండు మతాలకు చెందిన వారు కావడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేయకపోవడం సరైనది కాదని పేర్కొంది. వివాహం జరిగిందా లేదా అనేదే ముఖ్యమని కోర్టు పేర్కొంది. హైకోర్టు తన ఉత్తర్వులను స్థానిక స్వపరిపాలన కార్యదర్శకి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల వివాహాన్ని రెండు వారాల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..