JioMart Layoff 2023: ఇక జియోమార్ట్ వంతు.. 1000మందిని తీసేసిన కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioMart Layoff 2023: ప్రతిరోజూ ఏదో ఒక పెద్ద కంపెనీ పెద్ద ఎత్తున లేఆఫ్లు ఉంటాయని ప్రకటిస్తూనే ఉంది, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ హోల్సేల్ ప్లాట్ఫామ్ జియోమార్ట్ నుండి వెయ్యి మందికి పైగా వ్యక్తులను తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసింది. దీంతో వాటి కార్యకలాపాలపై కంపెనీ దృష్టి సారించిందని తెలుస్తోంది. కంపెనీ తన కార్పొరేట్ కార్యాలయంలోని 1,000 మంది ఎగ్జిక్యూటివ్లలో 500 మందికి పైగా గత కొన్ని రోజుల కిందటే రాజీనామా చేయవలసిందిగా కోరింది. రానున్న వారాల్లో మరో 9,900 మంది ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల ప్రణాళిక(Performance Improvement Plan)లో ఉంచిందని ఒక అధికారి తెలిపారు. అంతే కాకుండా ఇతర సేల్స్ ఉద్యోగులను వేరియబుల్ పే స్ట్రక్చర్పై ఉంచారు.
Read Also:Chetna Pande : బీచ్ ఒడ్డున అందాల సునామి సృష్టిస్తున్న చేతన పాండే
Also Read
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 15,000 మందిలో మూడింట రెండు వంతుల మేర తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తుంది. రాబోయే కొద్ది వారాల్లో కోతలు అమలులోకి రానున్నాయి. కంపెనీ తన 150కి పైగా ఆడియో ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లలో సగానికి పైగా మూసివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక స్టోర్లకు ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల నుంచే ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 344 మిలియన్ డాలర్లతో మెట్రో ఏజీ హోల్ సేల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. తాజా సంస్కరణల వెనుక ఇది కూడా ఒక కారణమేనని తెలుస్తోంది. మెట్రో ఏజీ కార్యకలాపాలను రిలయన్స్ రిటైల్ తో అనుసంధానించే క్రమంలో అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించడం కూడా ఇందులో భాగంగా ఉంది. జియోమార్ట్లో ఉపసంహరణ కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. పెద్ద ఎత్తున తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టమవుతుంది. జియోమార్ట్ మాత్రమే కాకుండా టెక్ సెక్టార్లో లేఆఫ్ గురించి మాట్లాడినట్లయితే, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనే 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉంది, అటువంటి పరిస్థితిలో ఇంకెంతమంది ఉద్యోగాలు కోల్పోతారో చూడాలి.
Read Also:Kaleshwaram Project : ప్యాకేజీ-9లోని మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం
తాజావార్తలు
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..