Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..
- బీజేపీకి మాజీ మిత్రుడి షాక్..
- హర్యానాలో కీలక రాజకీయ పరిణామాలు..
- రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇస్తామన్న చౌతాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dushyant Chautala: హర్యానాలో బీజేపీ పొత్తు నుంచి విడిపోయాక, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని గురువారం చెప్పారు. బీజేపీతో ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. హర్యానాలో గత ఎన్నికల అనంతరం బీజేపీ, జేజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, 4.5 ఏళ్ల తర్వాత ఈ పొత్తు విడిపోయింది. మనోహర్ లాల్ కట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేయడంతో బీజేపీతో, జేజేపీ పొత్తును ముగించింది. లోక్సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ కూడా రెండు పార్టీల మధ్య విబేధాలను తీసుకువచ్చాయి.
Read Also: West Godavari: తాడేపల్లిగూడెంలో దంపతుల మృతి.. విద్యుత్ షాక్తో భార్య.. కాపాడబోయి భర్త మృతి
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 05 స్థానాల్లో గెలిచాయి. ఒంటరిగా పోటీ చేసిన జేజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అయితే, కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా రోహ్తక్ నుంచి పోటీ చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. దీనికి ఎన్నికలు జరగనున్నాయి. తమ పార్టీ లాభనష్టాలను బీజేపీతో పొత్తు ప్రభావితం చేసినట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన రైతు ఉద్యమాన్ని కూడా తమ పార్టీ భరించాల్సి వచ్చిందని అన్నారు. కార్యకర్తలతో చర్చించి బీజేపీ కాకుండా ఏ పార్టీలో పొత్తు పెట్టుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చౌతాలా చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. లోక్సభలో ఓడిపోయేందుకు బీజేపీనే కారణమని అన్నారు.
రాజ్యసభ స్థానానికి ప్రముఖ వ్యక్తిని లేదా ఎవరైనా క్రీడాకారుడిని బరిలోకి దింపితే తాము కాంగ్రెస్కి మద్దతిస్తామని అన్నారు.కాంగ్రెస్ నిజంగా బిజెపిని ఎదుర్కోవాలనుకుంటే, వారు గెలుపు ఓటములను చూడకూడదని, వారు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇస్తామన్నారు. ఒక వేళ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించకుంటే అది ఆ రెండు పార్టీల మధ్య పొత్తను సూచిస్తుందని చెప్పారు. కాంగ్రెస్లా తమకు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే గెలుపోటములను ఆలోచించకుండా అభ్యర్థిని నిలబెట్టేవారని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!