Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..
- బీజేపీకి మాజీ మిత్రుడి షాక్..
- హర్యానాలో కీలక రాజకీయ పరిణామాలు..
- రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇస్తామన్న చౌతాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dushyant Chautala: హర్యానాలో బీజేపీ పొత్తు నుంచి విడిపోయాక, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని గురువారం చెప్పారు. బీజేపీతో ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. హర్యానాలో గత ఎన్నికల అనంతరం బీజేపీ, జేజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, 4.5 ఏళ్ల తర్వాత ఈ పొత్తు విడిపోయింది. మనోహర్ లాల్ కట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేయడంతో బీజేపీతో, జేజేపీ పొత్తును ముగించింది. లోక్సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ కూడా రెండు పార్టీల మధ్య విబేధాలను తీసుకువచ్చాయి.
Read Also: West Godavari: తాడేపల్లిగూడెంలో దంపతుల మృతి.. విద్యుత్ షాక్తో భార్య.. కాపాడబోయి భర్త మృతి
Also Read
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 05 స్థానాల్లో గెలిచాయి. ఒంటరిగా పోటీ చేసిన జేజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అయితే, కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా రోహ్తక్ నుంచి పోటీ చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. దీనికి ఎన్నికలు జరగనున్నాయి. తమ పార్టీ లాభనష్టాలను బీజేపీతో పొత్తు ప్రభావితం చేసినట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన రైతు ఉద్యమాన్ని కూడా తమ పార్టీ భరించాల్సి వచ్చిందని అన్నారు. కార్యకర్తలతో చర్చించి బీజేపీ కాకుండా ఏ పార్టీలో పొత్తు పెట్టుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చౌతాలా చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. లోక్సభలో ఓడిపోయేందుకు బీజేపీనే కారణమని అన్నారు.
రాజ్యసభ స్థానానికి ప్రముఖ వ్యక్తిని లేదా ఎవరైనా క్రీడాకారుడిని బరిలోకి దింపితే తాము కాంగ్రెస్కి మద్దతిస్తామని అన్నారు.కాంగ్రెస్ నిజంగా బిజెపిని ఎదుర్కోవాలనుకుంటే, వారు గెలుపు ఓటములను చూడకూడదని, వారు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇస్తామన్నారు. ఒక వేళ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించకుంటే అది ఆ రెండు పార్టీల మధ్య పొత్తను సూచిస్తుందని చెప్పారు. కాంగ్రెస్లా తమకు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే గెలుపోటములను ఆలోచించకుండా అభ్యర్థిని నిలబెట్టేవారని చెప్పారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!