Rashtrapati: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రెస్ రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతిగా రామ్నాథ్కోవింద్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్పై ఆసక్తి నెలకొంది. గత ఐదేళ్లలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 200కు పైగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో అవన్నీ చట్టాలుగా మారాయి. అయితే వాటిలో చాలా వరకు ఇంకా అమల్లోకి రాకపోవటం గమనార్హం. ఆయా చట్టాల అమలుకు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించకపోవటమే దీనికి కారణం. మరోవైపు.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ఐదేళ్ల కాలంలో ఆరు క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపినవాటిలో 159 బిల్లులకు ఆమోదముద్ర వేశారు.
తమిళనాడు పంపిన మూడు బిల్లులతోపాటు పశ్చిమ బెంగాల్ పంపిన మరో మూడు బిల్లులను నిలిపేశారు. ఒడిశా, అస్సాం పంపిన ఒక్కో బిల్లును కూడా “విత్హెల్డ్”లో పెట్టారు. దీర్ఘకాలం పెండింగ్లో ఉండి రామ్నాథ్కోవింద్ హయాంలో గ్రీన్ సిగ్నల్ పొందిన బిల్లుల్లో ‘గుజరాత్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ బిల్లు-2015’ కూడా ఒకటి. ఈ బిల్లు ఏకంగా 16 ఏళ్లపాటు పచ్చజెండాకు నోచుకోలేదు. యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నా దీనికి ఓకే చెప్పలేదు. పశ్చిమ బెంగాల్ పంపిన రెండు(జెసాప్ అండ్ కంపెనీ, డన్లప్ ఇండియా) బిల్లులకు రామ్నాథ్కోవింద్ సమ్మతించలేదు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
చట్టపరమైన అడ్డంకుల వల్ల వీటిని పక్కన పెట్టారు. ఈ బిల్లులను పశ్చిమ బెంగాల్ శాసన సభ ఏడేళ్ల కిందట పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-200 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును పాస్ చేసి ముందుగా గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపాలి. ఆ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు లేదా తన వద్ద పెండింగ్లో పెట్టొచ్చు లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపొచ్చు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతోపాటు తన విచక్షణాధికారంతో ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ తమిళనాడు గవర్నర్ పంపిన ‘ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల బిల్లు-2017’ని నిలిపేశారు.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చివరిసారిగా సంతకం చేసిన బిల్లుల్లో ‘క్రిమినల్ లా (మధ్యప్రదేశ్ అమెండ్మెంట్) బిల్లు-2019’ కూడా ఉంది. రామ్నాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీలక బిల్లుల్లో ‘ఉత్తరప్రదేశ్ మినిమం వేజెస్ (అమెండ్మెంట్) బిల్లు-2017’ ఉండటం గమనార్హం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్కి సంబంధించి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ పంపిన మూడు బిల్లుల పైనా రాష్ట్రపతి సంతకం చేశారు. ఐదేళ్లలో మొత్తం 29 దేశాల్లో పర్యటించారు. జమైకా దేశంలో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతిగా పేరొందారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!