Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్పై కేసు..
- రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు..
- కల్తీ ఆహారం, నకిలీ బెదిరింపుల ఫిర్యాదుపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rameshwaram Cafe: బెంగళూర్లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే నిఖిల్ అనే ప్రయాణికుడు జూలై 24న బెంగళూర్ నుంచి గౌహతి వెళ్తున్న సమయంలో కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1లో ఉన్న రామేశ్వరం కేఫే అవుట్ లెట్లో బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆడాడు. నిఖిల్, అతడి స్నేహితులు వెన్ పొంగల్, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేశారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
అయితే, పొంగల్లో వార్మ్ పురుగు కనిపించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై వేరే ప్లేట్ ఇస్తామని చెప్పారు. నిఖిల్కు అప్పటికే విమానం సమయం దగ్గర పడటంతో దీనిని తిరస్కరించి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అనేక మంది కస్టమర్లు, పొంగల్లో పొరుగు ఉన్న చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇదిలా ఉంటే, రామేశ్వరం కేఫ్ ప్రతినిధి సుమంత్ బీఎల్ అనే వ్యక్తి, నిఖిల్ రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేఫ్ బ్రాండ్ ప్రతిష్టలను దెబ్బతీస్తానని బెదిరించినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
నిఖిల్ తాను ఎలాంటి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేయలేదని, రామేశ్వరం కేఫ్ ప్రతినిధి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పాడు. కేఫ్ ఫిర్యాదులో పేర్కొన్న సమయంలో ఉదయం 10.27 గంటలకు తాను విమానంలోనే ఉన్నానని చెప్పారు. రుజువులుగా తన బోర్డింగ్ పాస్, ప్రయాణ రికార్డుల్ని సమర్పించారు. దీంతో పాటు కేఫ్ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నెంబర్లతో తనకు సంబంధం లేదని వెల్లడించాడు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు, నిఖిల్కు ఈ ఆరోపణలతో సంబంధం లేదని తేల్చారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు, ఆహార భద్రత ఉల్లంఘనలకు పాల్పడినందుకు నిఖిల్ ఫిర్యాదు చేస్తూ, రామేశ్వరం కేఫ్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!