Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్పై కేసు..
- రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు..
- కల్తీ ఆహారం, నకిలీ బెదిరింపుల ఫిర్యాదుపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rameshwaram Cafe: బెంగళూర్లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే నిఖిల్ అనే ప్రయాణికుడు జూలై 24న బెంగళూర్ నుంచి గౌహతి వెళ్తున్న సమయంలో కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1లో ఉన్న రామేశ్వరం కేఫే అవుట్ లెట్లో బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆడాడు. నిఖిల్, అతడి స్నేహితులు వెన్ పొంగల్, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేశారు.
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
అయితే, పొంగల్లో వార్మ్ పురుగు కనిపించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై వేరే ప్లేట్ ఇస్తామని చెప్పారు. నిఖిల్కు అప్పటికే విమానం సమయం దగ్గర పడటంతో దీనిని తిరస్కరించి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అనేక మంది కస్టమర్లు, పొంగల్లో పొరుగు ఉన్న చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇదిలా ఉంటే, రామేశ్వరం కేఫ్ ప్రతినిధి సుమంత్ బీఎల్ అనే వ్యక్తి, నిఖిల్ రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కేఫ్ బ్రాండ్ ప్రతిష్టలను దెబ్బతీస్తానని బెదిరించినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.
నిఖిల్ తాను ఎలాంటి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేయలేదని, రామేశ్వరం కేఫ్ ప్రతినిధి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పాడు. కేఫ్ ఫిర్యాదులో పేర్కొన్న సమయంలో ఉదయం 10.27 గంటలకు తాను విమానంలోనే ఉన్నానని చెప్పారు. రుజువులుగా తన బోర్డింగ్ పాస్, ప్రయాణ రికార్డుల్ని సమర్పించారు. దీంతో పాటు కేఫ్ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నెంబర్లతో తనకు సంబంధం లేదని వెల్లడించాడు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు, నిఖిల్కు ఈ ఆరోపణలతో సంబంధం లేదని తేల్చారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు, ఆహార భద్రత ఉల్లంఘనలకు పాల్పడినందుకు నిఖిల్ ఫిర్యాదు చేస్తూ, రామేశ్వరం కేఫ్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!