Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..

  • రామ మందిర విరాళాల చోరీ కేసు..
  • 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు..
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram mandir: అయోధ్య రామమందరంలో భక్తులు సమర్పించిన విరాళాల కుంభకోణానికి సంబంధించి గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన ఫిర్యాదు, సిట్ సిఫారసుల మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్), అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్, కరుణేష్, లవ్‌కుష్ మిశ్రాలపై విచారణ జరపనున్నారు.

ప్రధాన నిందితులైన లవ్‌కుష్ మిశ్రా, అనుకుల్ మిశ్రాలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయంలో ఓట్ల లెక్కింపు బాధ్యతను వీరే నిర్వర్తిస్తున్నారు. అవినాష్ త్రిపాఠి, కరుణేష్ పాండే, సుభాష్ చంద్ర మిశ్రా, నీష్ యాదవ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆదేశాల మేరకు, బీఎన్‌సీలోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ ఎఫ్ఐఆర్‌లో ప్రభుత్వ సేవకుడు లేదా ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ద్వారా జరిగిన దొంగతనం, దొంగతనానికి ప్రేరేపించడం, నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస భంగం వంటి అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది.