IND vs ENG: భారత్ది కూడా ‘బజ్బాల్’ ఆటే.. బిత్తరపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్! ఆధిక్యం 166
- రెండో ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడుతున్న భారత్
- 70 బంతుల్లో ఆకాశ్ దీప్ అర్ధ శతకం
- జైస్వాల్ 106 బంతుల్లో 85 రన్స్
- భారత్ ఆధిక్యం 166 రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Plays Bazball in IND vs ENG 5th Test 2025: ఇటీవలి కాలంలో ‘బజ్బాల్’ క్రికెట్ అంటూ.. ఇంగ్లండ్ టెస్టుల్లో దూకుడైన ఆట తీరును ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. వేగంగా పరుగులు చేసి.. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ టీమ్ ఆడుతోంది. బజ్బాల్ ఆటతో చాలా మ్యాచ్లను కూడా గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా ఇంగ్లండ్ తన బజ్బాల్ ఆటను కొనసాగిస్తోంది. ఐదవ టెస్ట్ మ్యాచ్లోని రెండో ఇన్నింగ్స్లో భారత్ కూడా బజ్బాల్ ఆటను ఆడుతోంది.
రెండో ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 75/2తో ఆటను ప్రారంభించిన భారత్.. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి మరో వికెట్ కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్, యశస్వి జైస్వాల్ ఇద్దరు ధాటిగా ఆడారు. ముఖ్యంగా ఆకాశ్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జైస్వాల్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఆకాశ్ 70 బంతుల్లో అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 150 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ తర్వాత నాలుగు ఫోర్లు బాదిమా ఆకాష్.. ఒవర్టన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 94 బంతుల్లో 12 ఫోర్లతో 66 రన్స్ చేశాడు.
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
Also Read: Akash Deep Fifty: ఆకాశ్ దీప్ సూపరో సూపర్.. హాఫ్ సెంచరీ వీడియో వైరల్!
ఆకాశ్ దీప్ అవుట్ అనంతరం శుభ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 8 బంతుల్లో 11 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 85 రన్స్ చేశాడు. యశస్వి సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 44 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి 189 రన్స్ చేసింది. భారత్ రన్ రేట్ 4.3గా ఉంది. భారత్ ‘బజ్బాల్’ ఆటను చూసి ఇంగ్లండ్ ప్లేయర్స్ బిత్తరపోతున్నారు. రెండో సెషన్లో కూడా యశస్వి, గిల్ ఇదే ఆట ఆడితే.. భారత్ ఆధిక్యం 250 ప్లస్ అవుతుంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!