రాజస్థాన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భివాడి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనం కాగా.. మరో 10 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తు్న్నారు.
భివాడిలోని ఖైర్తల్-తిజారాలోని ఖుస్ఖేడ కరౌలి పారిశ్రామిక ప్రాంతంలోని ఒక రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20-25 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్