PM Modi: “సందేశ్ఖలీ”పై స్పందించిన పీఎం మోడీ.. ఆయన ఆత్మ క్షోభిస్తోందని మమతా పార్టీపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల అఘాయిత్యాలపై పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలీ ప్రాంతం గత కొన్ని వారాలుగా అట్టుడుకుతోంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని అక్కడి మహిళలు, ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి బీజేపీ మద్దతు తెలిపింది. దాదాపుగా 55 రోజులుగా పరారీలో ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు, గవర్నర్ సీరియస్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా సందేశ్ఖలి లైంగిక వేధింపులపై స్పందించారు. ఈ విషయంలో రాజారామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తోందని శుక్రవారం అన్నారు. హుగ్లీ జిల్లాలోని ఆరాంబాగ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ.. సందేశ్ఖలీ సోదరీమణులపై టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందని, ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందన్నారు. సందేశ్ఖలీలో ఒక టీఎంసీ నాయకుడు హద్దుల్ని దాడాడు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇక్కడి మహిళల గౌరవం కోసం పోరాడారని చెప్పారు.
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
టీఎంసీ పార్టీ నిందితుడికి రక్షణ కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. సందేశ్ఖలీలో మహిళ బాధల కన్నా కొందరి ఓట్లు మాత్రమే మమతా బెనర్జీకి ముఖ్యమయ్యాయా..? అని ప్రధాని ప్రశ్నించారు. ఈ అంశంపై ఇండియా కూటమి నేతల మౌనాన్ని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ ‘మా, మాతీ, మనుష్’ (తల్లి, భూమి మరియు ప్రజలు) నినాదాన్ని ప్రస్తావిస్తూ.. టీఎంసీ సందేశ్ఖలీ మహిళలకు ఏం చేసిందని అడిగారు.
Read Also: Live-in relationship: మరో “లివ్ ఇన్ పార్ట్నర్” హత్య.. ఈ సారి నిందితురాలు మహిళ..
షేక్ షాజహాన్పై తీవ్ర ఆరోపణలు రావడంతో టీఎంసీ పార్టీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. నిన్న షేక్ షాజహాన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. అతడిని బెయిల్ ఇచ్చేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించింది. అతనిపై తమకు ఎలాంటి సానూభూతి లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. 10 రోజుల పాటు అతడికి కస్టడీ విధించింది. రేషన్ బియ్యం కుంభకోణంలో ఇతడిపై ఈడీ విచారణకు వెళ్లిన క్రమంలో అధికారులపై ఇతని మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి మహిళలపై టీఎంసీ గుండాలు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇదే కాకుండా లోకల్ టీఎంసీ నేతలు భూములను కబ్జా చేయడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షేక్ షాజహాన్పై ఏకంగా 43 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!