Northern Railway: మసీదులకు రైల్వే అధికారుల నోటీసులు .. 15 రోజుల్లోగా ఆక్రమణలను తొలగించాలి
Northern Railway: దేశ రాజధానిలోని రెండు మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఢిల్లీలోని బెంగాలి మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు నార్తర్న్ రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. రైల్వే భూములను ఆక్రమించుకున్న అక్రమ భవనాలు, దేవాలయాలు, మసీదులు ఇతర ప్రార్థనా స్థలాల నిర్వహాకులను కోరుతున్నామని, అందులో భాగంగా మసీదులకు నోటీసులు ఇచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read also: Megastar Chiranjeevi: అబ్బా ఏమున్నావ్ బాసూ..యంగ్ హీరోలకు నిద్ర పడుతుందా
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
తామిచ్చిన గడువులోగా ఆక్రమణలు తొలగించాలని, లేనట్లయితే రైల్వే యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అక్రమ కట్టడాలను తొలగించే సమయంలో జరిగే నష్టానికి తాము బాధ్యులం కాదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ.. 400 ఏండ్ల నాటి బాబా షా టకియా మసీదుకు అధికారులు నోటీసులు జారీచేయడం గమనార్హం. గతంలో రైల్వే అధికారులు హనుమంతుడి గుడికి కూడా ఇలాంటి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామంటూ గుడికి మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఫిబ్రవరి 13న హుకుం జారీ చేశారు. మొరెనా జిల్లాలో సబల్గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్గేజ్ పనులు జరుగుతున్న క్రమంలో.. హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే దానిని తొలగించాలంటూ గుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును సైతం మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. కాగా, పొరపాటున దేవుడి పేరిట నోటీసు జారీ చేశామని, గుడి పూజారి పేరుతో కొత్త నోటీసులు ఇస్తామని రైల్వే అధికారి మనోజ్కుమార్ చెప్పారు.
తాజావార్తలు
-
Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను.. అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
-
Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!