Northern Railway: మసీదులకు రైల్వే అధికారుల నోటీసులు .. 15 రోజుల్లోగా ఆక్రమణలను తొలగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Northern Railway: దేశ రాజధానిలోని రెండు మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఢిల్లీలోని బెంగాలి మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు నార్తర్న్ రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. రైల్వే భూములను ఆక్రమించుకున్న అక్రమ భవనాలు, దేవాలయాలు, మసీదులు ఇతర ప్రార్థనా స్థలాల నిర్వహాకులను కోరుతున్నామని, అందులో భాగంగా మసీదులకు నోటీసులు ఇచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read also: Megastar Chiranjeevi: అబ్బా ఏమున్నావ్ బాసూ..యంగ్ హీరోలకు నిద్ర పడుతుందా
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
తామిచ్చిన గడువులోగా ఆక్రమణలు తొలగించాలని, లేనట్లయితే రైల్వే యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అక్రమ కట్టడాలను తొలగించే సమయంలో జరిగే నష్టానికి తాము బాధ్యులం కాదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ.. 400 ఏండ్ల నాటి బాబా షా టకియా మసీదుకు అధికారులు నోటీసులు జారీచేయడం గమనార్హం. గతంలో రైల్వే అధికారులు హనుమంతుడి గుడికి కూడా ఇలాంటి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామంటూ గుడికి మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఫిబ్రవరి 13న హుకుం జారీ చేశారు. మొరెనా జిల్లాలో సబల్గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్గేజ్ పనులు జరుగుతున్న క్రమంలో.. హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే దానిని తొలగించాలంటూ గుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును సైతం మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. కాగా, పొరపాటున దేవుడి పేరిట నోటీసు జారీ చేశామని, గుడి పూజారి పేరుతో కొత్త నోటీసులు ఇస్తామని రైల్వే అధికారి మనోజ్కుమార్ చెప్పారు.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!