Amit Shah: రాయ్బరేలీలో రాహుల్ గాంధీ భారీ తేడాతో ఓడిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, నిన్న రాయ్బరేలీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీ పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే, దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తారు. ఈ రోజు గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి భారీ మెజారిటీతో ఓడిపోతారని అన్నారు. దళితులు, గిరిజనులు, వెనకబడిన వారి కోసం నిర్దేశించిన రిజర్వేషన్లను ప్రతిపక్ష ఇండియా కూటమి దోచుకుంటోందని అమిత్ షా ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినప్పుడు వయనాడ్ వెళ్లారు. ఈ సారి వయనాడ్ నుంచి ఓడిపోతానని గ్రమించి అమేథీ కాకుండా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు’’ అని షా అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ‘‘ రాహుల్ బాబా నా సలహా తీసుకోండి. ప్రాబ్లం సీటుది కాదు, మీది. మీరు రాయ్బరేలీ నుంచి కూడా భారీ తేడాతో ఓడిపోతారు. మీరు పారిపోయినా ప్రజలు మిమ్మల్ని కనుగొంటారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
Read Also: Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ జాడ కోసం సీబీఐ సాయం కోరిన కర్ణాటక..
ప్రధాని మోడీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారనంటూ రాహుల్ బాబా అండ్ కంపెనీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి 2014, 2019లో పూర్తి మెజారిటీ ఉంది, కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎప్పుడూ టచ్ చేయలేదని, ఇది బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేదని, ఎవరూ కూడామ రిజర్వేషన్లను తాకరని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను దోచుకున్నది ఇండియా కూటమి అని ఆయన ఆరోపించారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఓబీసీల రిజర్వేషన్లను దోచుకుని 4 శాతం కోటాను ముస్లింకు ఇచ్చారని, ఏపీలో కూడా 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఇది సరైన పద్ధతి కాదని షా పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు అధికారంలోకి వస్తే ఈ వర్గాలకు కేటాయించిన కోటాను లాక్కుని ముస్లింలకు ఇస్తారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోందని షా ఆరోపించారు. తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతో అయోధ్య రామమందిర ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేజ్రీవాల్ వంటి వారు తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ ఆదివాసీలకు మొదటి నుంచి వ్యతిరేకమని, అందుకే దాదాపు 70 ఏళ్లపాటు దేశాధ్యక్షుడిగా గిరిజన వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నడూ అనుమతించలేదని షా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!