Rahul Gandhi: బీహార్ పోలింగ్కు ముందు రాహుల్గాంధీ షాక్.. ‘ఓట్ చోర్’’పై కీలక ప్రజెంటేషన్
- బీహార్ పోలింగ్కు ముందు రాహుల్గాంధీ షాక్
- ‘ఓట్ చోర్’’పై కీలక ప్రజెంటేషన్
- బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. తీరా ఫలితాల సమయానికి అంతా తారుమారు చేశారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లో మాత్రమే కాంగ్రెస్కు ఎడ్జ్ కనిపించిందని.. ఈవీఎంల లెక్కింపు సమయంలో ఫలితాలు తారుమారైపోయాయని చెప్పారు. హర్యానాలో 2 కోట్ల ఓటర్లు ఉంటే.. 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని తెలిపారు. కేవలం 22 వేల ఓట్ల తేడాతో హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఒక బీజేపీ నేత కుమారుడు రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎంలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. హర్యానాలో 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని వివరించారు.
‘‘బ్రెజిల్ మోడల్ మాథ్యూస్ ఫెరిరో ఫొటోతో 10 పోలింగ్ బూత్ల్లో 22 ఓట్లు ఉన్నాయి. ఒకే ఫొటోతో 253 ఓట్లు రెండు పోలింగ్ బూత్ల్లో ఉన్నాయి. ఇలాంటి ఫేక్ ఓట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. 1,24,177 ఫేక్ ఓట్లు ఉన్నాయి. ఈ అక్రమాలు బయటపడవద్దని ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేసింది . సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడంలేదు. డూప్లికేట్ ఓట్లను తొలగించే సాఫ్ట్వేర్ ఈసీ దగ్గర ఉంది. కానీ ఎందుకు డూప్లికేట్ ఓట్లు తొలగించడం లేదు. బీజేపీయే డూప్లికేట్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్పిస్తుంది. యూపీ, హర్యానాలో వేల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. యూపీ, హర్యానాలో బీజేపీ నాయకులకు ఓట్లు రెండు చోట్ల ఓట్లున్నాయి. హర్యానాలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడున్నర లక్షల ఓట్లను తొలగించారు.’’ అని రాహుల్గాంధీ ఆరోపించారు.
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
ఇది కూడా చదవండి: Zohran Mamdani: జవహర్లాల్ నెహ్రూను గుర్తుచేసుకుంటూ మమ్దానీ తొలి ప్రసంగం
రేపే బీహార్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్లకు తరలివెళ్తున్నారు. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక తొలి దశలో 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ గురువారం (06-11-2025) 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో దశ 11-11-2025న జరగనుంది. రెండో విడతలో 122 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
LIVE: #VoteChori Press Conference – The H Files https://t.co/IXFaH9fEfr
— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025
తాజావార్తలు
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
-
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!