Anurag Thakur: రాహుల్ గాంధీ ఇక్కడ గెలవలేక.. విదేశాల్లో విమర్శలు చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘాలో ఉన్నానని యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అనురాగ్ ఠాకూర్, రాహుల్ గాంధీ విమర్శలను శుక్రవారం తప్పుపట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విదేశీ గడ్డపై భారతదేశాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sexual Ability : పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని ‘కోకా-కోలా, పెప్సీ’ మెరుగుపరుస్తాయట..
Also Read
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, తనతో పాటు ఇతర రాజకీయ నేతలపై ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ తో నిఘా పెట్టారని ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లను ఎందుకు సమర్పించలేదని ఠాకూర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పట్ల రాహుల్ గాంధీకి ఉన్న ద్వేషాన్ని అర్ధం చేసుకోగలం, అయితే విదేశీ స్నేహితుల సాయంతో దేశాన్ని కించపరిచే కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందని ఆయన ఆరోపించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని రాహుల్ గాంధీకి తెలుసని, అందుకే విదేశీ గడ్డపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా విదేశీ గడ్డపై దుష్ఫ్రచారం చేయడం చూస్తే కాంగ్రెస్ దివాళాకోరు తనం అర్థం అవుతోందని అన్నారు. పెగాసస్ విషయంలో ఆయన పదేపదే అబద్ధాలు చెబుతున్నారని ఠాకూర్ ఆరోపించారు. విదేశాల్లో భారత్ పరువుతీయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చెప్పేది కనీసం రాహుల్ గాంధీ వినాలని అన్నారు. ప్రధాని మోదీ నాయకుడిగా ఎదిగారని, రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ మాత్రం పదేపదే ఎన్నికల్లో ఓడిపోతుందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!