Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!
- బెంగాల్లో టీఎంసీ పరాజయం
- మమత ఓటమిపై కాంగ్రెస్ నేతలు వెకిలి నవ్వులు
- బెంగాల్ నాయకులపై మండిపడ్డ రాహుల్గాంధీ
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఓటమిపై ఆ పార్టీ నేతలు వెకిలి నవ్వులు నవ్వారు. ఈ వ్యవహారం రాహుల్ గాంధీకి కోపం తెప్పించింది.
ఈ సందర్భంగా సొంత పార్టీ నాయకులను గట్టిగా మందలించారు. బీజేపీ తన లక్ష్యంలో విజయం సాధిస్తోందని.. ఇలాంటి సమయంలో మనం సంకుచిత రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్లోని కొందరు టీఎంసీ ఓటమిని చూసి సంబరపడుతున్నారని.. ఇదేమీ పద్ధతి కాదు అసోం, బెంగాల్ ప్రజల తీర్పును అపహరించడం అనేది.. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో బీజేపీ వేసిన భారీ ముందడుగు.’’ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. ఇక నుంచి ‘‘చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండి. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం.’’ అని అన్నారు.
Also Read
- TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
- RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
- AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. టీఎంసీ 80, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. అయితే రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేశారు. ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు.
Some in the Congress, and others, are gloating about TMC’s loss.
They need to understand this clearly – the theft of Assam and Bengal’s mandate is a big step forward by the BJP in its mission to destroy Indian democracy.
Put petty politics aside. This is not about one party or…
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!
-
Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
-
AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి ‘నాబార్డ్’ ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
-
PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
-
Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!