Rahul Gandhi: ‘40% కమిషన్’పై రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు కోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
Read Also: Paytm: పేటీఎంకి ఊరట.. యూపీఐ లావాదేవీలపై ఎన్పీసీఐకి ఆర్బీఐ కీలక సూచన..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ‘పేసీఎం’ వంటి పోస్టర్లను ప్రచురించింది. 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించింది. ఈ ప్రకటనపై బీజేపీ లీగల్ విభాగం ఫిర్యాదుపై, కాంగ్రెస్ నేతలు మార్చి 28న ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో హాజరుకావాలని కోరింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు 40 శాతం కమీషన్ ఆరోపణలపై ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తోంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. కాంగ్రెస్ పాలనలో 40 శాతానికి బదులుగా 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి బి శివరాము సొంతపార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితి మరింత దిగజారిందని శివరాము పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!