Rahul Gandhi: రైతులతో రాహుల్గాంధీ భేటీ.. ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ బీజేపీ ధ్వజం
- రైతులతో రాహుల్గాంధీ భేటీ
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చ
- ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ బీజేపీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాలు త్వరలో సంతకాలు కూడా చేయనున్నాయి. అయితే అమెరికా వాణిజ్య ఒప్పందంతో అన్నదాతలు రోడ్డెక్కారు. కేంద్ర నిర్ణయంతో రైతులకు ఇబ్బందులేనని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ రైతులతో సమావేశం అయ్యారు. ఇప్పటికే ఒకసారి భేటీ కాగా.. తాజాగా మరోసారి పార్లమెంట్ హాల్లో కలిశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 17 ప్రధాన రైతు సంఘాల ప్రతినిధులను కలిశారు. ఈ ఒప్పందం కారణంగా భారతీయ రైతులకు.. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, గింజలు పండించే రైతులకు హాని కలిగిస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు.
Also Read
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
రైతులతో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ ధ్వజమెత్తారు. దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారని… ఇదంతా ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ ధ్వజమెత్తారు. అత్యంత కృత్రిమమైన, నకిలీ సమావేశంగా అభివర్ణించారు. రైతులను తప్పుదారి పట్టించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కష్టపడి పనిచేసే అన్నదాతలను గందరగోళానికి గురిచేయడం, ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యతిరేకంగా మనోభావాలను రెచ్చగొట్టడం ఈ సమావేశం లక్ష్యం అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు.
ఇది కూడా చదవండి: Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
భారత వస్తువులపై పరస్పర సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి అమెరికా అంగీకరించిందని… ఇది వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఔషధాలలో భారత ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ 90-95 శాతం భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇటీవలే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. గతంలో ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి.
नरेंद्र “surrender” मोदी ने भारत के किसानों के साथ विश्वासघात किया है – और किसान यह बात समझ चुके हैं।
यह सिर्फ़ एक व्यापार समझौता नहीं है, बल्कि हमारे अन्नदाताओं की आजीविका पर सीधा हमला है।
संसद में आज किसान यूनियनों के प्रतिनिधिमंडल से मुलाक़ात में उनकी चिंता साफ़ दिखी।… pic.twitter.com/YwfnJBMVcD
— Rahul Gandhi (@RahulGandhi) February 13, 2026
Farzi Rahul Gandhi… pic.twitter.com/lMMWhj7kKm
— Piyush Goyal (@PiyushGoyal) February 13, 2026
తాజావార్తలు
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!