Rahul vs Modi: లోక్సభలో రాహుల్ స్పీచ్.. పదే పదే మోడీ, బీజేపీ ఎంపీల అభ్యంతరం
- లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రసంగం
- పదే పదే అడ్డుతగిలిన ప్రధాని మోడీ.. బీజేపీ ఎంపీలు
- గత పదేళ్ల ఎన్డీఏ పాలనపై విపక్ష నేత ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సమావేశం అంతా హాట్ హాట్గా సాగింది. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ అనే భావన, రాజ్యాంగంతో పాటు బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని రాహుల్ ఆరోపించారు. అందులో తానూ బాధితుడినేనని.. తనపై కూడా 20కిపైగా కేసులు మోపారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Double ISMART : “స్టెప్ప మార్ ” తో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్..
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
తనకు రెండేళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అలాగే ఇల్లు కూడా తీసేసుకున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నట్లు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. అయితే రాహుల్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ సహా బీజేపీ ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharashtra Video: వామ్మో.. నడిరోడ్డుపైకి మొసలి.. హడలెత్తిపోయిన జనాలు
ఇక ప్రసంగం మధ్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్ఎస్ఎస్లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ తెలిపారు.
#WATCH | Leader of Opposition in Lok Sabha, Rahul Gandhi says, "…The PM says that (Mahatma) Gandhi is dead and Gandhi was revived by a movie. Can you understand the ignorance?… Another thing I noticed is that it is not just one religion that talks about courage. All religions… pic.twitter.com/2N3NdYHNw8
— ANI (@ANI) July 1, 2024
#WATCH | After LoP Lok Sabha Rahul Gandhi attacks him, PM Modi responds by saying, "Calling the entire Hindu community violent is a very serious matter." pic.twitter.com/HrpCvLg3hF
— ANI (@ANI) July 1, 2024
#WATCH | Responding to LoP Rahul Gandhi, Union Home Minister Amit Shah in Lok Sabha says, "The Leader of Opposition has categorically said that those who call themselves Hindu talk of violence and do violence. He doesn’t know that crores of people proudly call themselves Hindu.… pic.twitter.com/yFwIsXeTN6
— ANI (@ANI) July 1, 2024
తాజావార్తలు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్కు ఫ్యాన్స్ ఫిదా
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!