Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

  • భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది
  • కోటా ర్యాలీలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
Rahulgandhi

Rahulgandhi

భారతదేశ విద్యా వ్యవస్థ పిల్లలపై విపరీతమైన ఒత్తిడిని పెంచి వారిని నలిపేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. కోటా ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నేడు ఎంతో మంది యువ ఆశావహులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఏ విద్యార్థి కూడా ఎదుర్కోకుండా ఉండేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయ సమావేశం కాదు… విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదిక అన్నారు. ఈ సమావేశం మీ గురించి.. భవిష్యత్ కోసం పోరాడుతున్న యువత కోసమే అని తెలిపారు.

ఇక ప్రసంగానికి ముందు ముగ్గురు అమ్మాయిలను, ఇద్దరు అబ్బాయిలను వేదికపైకి ఆహ్వానించారు. నీట్, జేఈఈ, సివిల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల కలలను, ఆకాంక్షలను ప్రోత్సహించడంలో దేశ విద్యా వ్యవస్థ విఫలమవ్వడమే అతి పెద్ద బలహీనత అన్నారు. ‘‘ప్రతి విద్యార్థి డాక్టరో.. ఇంజనీరోనో ఎందుకు అవ్వాలి?.’’ అని విద్యా వ్యవస్థను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

×
×
Ad