Rahul Gandhi: రాహుల్ గాంధీకి థానే కోర్టు రూ.500 జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thane court: 2017లో జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యతో సంఘ్కు సంబంధం ఉందని ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో లిఖితపూర్వక స్టేట్మెంట్ను దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి థానే కోర్టు 500 రూపాయల జరిమాన విధించింది. అయితే, వ్రాతపూర్వక ప్రకటనను దాఖలు చేయడంలో రాహుల్ గాంధీ 881 రోజులు జాప్యంపై క్షమాపణ కోరుతూ అతని తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ ఒక దరఖాస్తును దాఖలు చేశారు.
Read Also: Khalistani Terrorist: అయోధ్యలో విధ్వంసం సృష్టస్తాం.. సీఎంను చంపేస్తాం..
Also Read
- NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
అయితే, రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసి అలాగే ఆయన ఒక ఎంపీ కాబట్టి తన నియోజకవర్గంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది.. అందువల్ల ఆయన సకాలంలో వ్రాతపూర్వక ప్రకటనను దాఖలు చేయలేకపోయారని ఆయన న్యాయవాది నారాయణ్ అయ్యర్ కోర్టులో సమర్పించారు. ఇక, రాహుల్ గాంధీపై కేసును ఆర్ఎస్ఎస్ వాలంటీర్ వివేక్ చంపానేర్కర్ తన లాయర్ ఆదిత్య మిశ్రా ద్వారా దాఖలు చేశారు. రాహుల్ గాంధీ దరఖాస్తును ఆర్ఎస్ఎస్ తరపు లాయర్ మిశ్రా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకుడి ఈ ఇష్యూను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Richest Family: వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ.. 700కార్లు, రూ.4000కోట్ల ఇల్లు, 8జెట్లు.. అంతులేని సంపద
ఇక, రాహుల్ గాంధీ చేసిన ఆలస్యానికి థానే కోర్టు 500 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న మరోసారి విచాణ చేస్తామని కోర్టు తెలిపింది. అప్పుటి వరకు రాహుల్ గాంధీ వ్రాతపూర్వక స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది అని కోర్టు పేర్కొనింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం.. పరువు నష్టం అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టు ముందు తన రక్షణగా వ్రాతపూర్వక ప్రకటనను సమర్పించాలి ఉంటుంది. వ్రాతపూర్వక స్టేట్మెంట్ దాఖలు చేసిన తర్వాత సాక్షులను ప్రశ్నించడంతో పాటు క్రాస్ క్వశ్చన్ చేయడం ప్రారంభమవుతుంది. అయితే, మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు మార్చి 2023లో ఆయనను దోషిగా నిర్ధారించింది.. దీంతో లోక్సభ ఎంపీగా కూడా సస్పెండ్ చేయబడ్డాడు.. అయితే సుప్రీం కోర్టు శిక్షపై స్టే విధించడంతో తన ఎంపీ పదవిని తిరిగి పొందాడు.
తాజావార్తలు
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!