IAS: ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్.. మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్
- ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్
- మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ట్రైనింగ్లో ఉన్న ఒక ఐఏఎస్. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించింది. అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఆమె మాత్రం అధికార దర్పం అనుభవించాలని ముచ్చట పడింది. ఊహా ప్రపంచంలో విహరించింది. ఇంకేముంది అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసేసుకుంది. ఈ యవ్వారం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మూల్యం చెల్లించుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.

Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
పూజ ఖేద్కర్ అనే ఒక మహిళా ప్రొబేషనరీ ఐఏఎస్.. పూణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రొబేషనరీగా ఉన్నప్పుడు ఆమెకు సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె మాత్రం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ప్రైవేటు ఆడి కారు, పైన రెడ్-బ్లూ బీకన్ లైట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసి ఉన్న నేమ్బోర్డు పెట్టేసుకుంది. అంత మాత్రమే కాదు… వీటితో పాటు తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్తో ఓ అధికారిక ఛాంబర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

ఇక అంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ఛాంబర్లో ఆమె నేమ్ప్లేట్ పెట్టుకుని దాన్ని తన ఛాంబర్గా మార్చేసుకుంది. పాత కుర్చీలు, సోఫాలు, టేబుల్లతో సహా అన్ని మెటీరియల్లను తొలగించేసింది. లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్ప్లేట్, రాజముద్ర, ఇంటర్కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్ను ఆదేశించారు. ఇక ఆమె తండ్రైన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి తన కుమార్తె డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయ అధికారులను ఒత్తిడి చేశారు. లేదంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: USA: భారత్-రష్యా సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు..
ఈ వ్యవహారం మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చర్యలు చేపట్టింది. పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో పూజా ఖేద్కర్ను పూణె నుంచి వాషిమ్కు బదిలీ చేశారు. ఆమె తన ప్రొబేషన్ కాలం పూర్తయ్యే వరకు వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!