Pune Rape Case: నిందితుడు చివరికిలా చిక్కాడు! అదే పట్టించింది
- పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ అరెస్ట్
- అర్ధరాత్రి సమయంలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ రాందాస్(36) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 75 గంటల పోలీసుల వేట తర్వాత దొరికిపోయాడు. నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు వేటాడాయి. పూణె సమీప ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వేటాడారు. డ్రోన్లు, డాగ్స్క్వాడ్స్తో తనిఖీలు చేపట్టారు. అయితే పూణె సమీప గ్రామాల్లో ఎత్తున చెరుకు తోటలో ఉన్నట్లుగా డ్రోన్ సాయంతో గుర్తించారు. ఆ దిశగా పోలీసులు వేటాడారు. అయితే అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన ఆకలి వేయడంతో ఓ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటికే నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. మొత్తానికి ఇంటి వారు పోలీసులకు రహస్యంగా సమాచారం ఇవ్వడంతో చాకచాక్యంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి నిందితుడు దత్తాత్రయ రాందాస్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇది కూడా చదవండి: Earthquake: నేపాల్, పాకిస్థాన్.. ఉత్తర భారత్లో భూప్రకంపనలు
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
మహారాష్ట్రలో అతిపెద్ద బస్సు డిపోల్లో ఒకటైన పూణెలోని స్వర్గేట్ బస్టాండ్ దగ్గర మంగళవారం ఉదయం 6 గంటలకు బస్సు కోసం ఓ యువతి (26) నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న రాందాస్… చెల్లి అని సంబోధించాడు. మీ ఊరు వెళ్లే బస్సు ఇక్కడ లేదని.. ఫలానా చోటు ఉందని నమ్మించి తీసుకెళ్లాడు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎక్కేందుకు సంకోచించింది. అయితే లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని చెప్పడంతో లోపలికి వెళ్లింది. అంతే వెంటనే బస్సు డోర్ మూసివేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం వెంటనే బస్సులోంచి దూకేసి పారిపోయాడు. అయితే బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని స్నేహితురాలితో పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రాందాస్గా గుర్తించారు.
ఇక ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలని డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే నిందితుడు రాందాస్పై అనేక నేరాలు, దోపిడీ కేసులు ఉన్నాయి. స్వర్గేట్ బస్టాండ్ దగ్గర ట్యాక్సీ డ్రైవర్గా ఉంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా స్థానిక పోలీసులతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను కూడా పోలీస్ అంటూ నటించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక వృద్ధులను ట్యాక్సీ ఎక్కించుకుని వారి దగ్గర బంగారం, డబ్బులు దోచుకునేవాడని సమాచారం. నిందితుడి దుర్మార్గాలను పోలీసులు వెలికి తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ..
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!