Madras High Court: అర్చకత్వానికి కులంతో పని లేదు: మద్రాస్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: అర్చకత్వానికి కులం అడ్డుకాదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అర్చకత్వానికి కులంతో పని లేదని, ఎవరైనా అర్చకులు కావచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. సేలం సుకవనేశ్వరాలయంలో అర్చకుల నియామకానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆలయ యాజమాన్యం 2018లో ప్రకటన వెలువరించగా, దాన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పని చేస్తున్న సుబ్రమణ్య గురుకల్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆలయంలో ఆగమశాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నామని, అర్చక వృత్తికి ఆగమ విధానాలపై కనీస జ్ఞానం లేనివారిని ఆహ్వానించడం సరికాదని, అందువల్ల ఆలయ యాజమాన్యం చేసిన ప్రకటనను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి … అర్చకవృత్తికి కులం అడ్డు కాదంటూ గతంలో తీర్పు వెల్లడించారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పిటిషనర్ అప్పీలు చేశారు.
Read also: Nallapareddy: బాబు, పవన్కు మతిభ్రమించింది.. వాళ్లు సీఎంలు అయ్యేదే లేదు..!
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
అప్పీలు పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంగాపూర్వాలా, న్యాయమూర్తి జస్టిస్ ఆదికేశవులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆగమశాస్ర్తాలు పాటించే ఆలయాల్లో వంశపారంపర్యంగా వచ్చే అర్చకులను మాత్రమే నియమించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉందన్నారు. అప్పుడు ప్రభుత్వం తరఫున ఆర్.షణ్ముగసుందరం వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ గతంలో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2405 అర్చక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అప్పుడు జోక్యం చేసుకున్న ధర్మాసనం.. దీనిపై ఇప్పటి వరకూ నివేదిక సమర్పించలేదని, సేలం సుకవనేశ్వరాలయంలో అమలు చేస్తున్న ఆగమ విధివిధానాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక దేవాదాయశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 22వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!