Queen Elizabeth 2 Funeral: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు వెళ్లనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu To Attend Queen Elizabeth-2 Funeral: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలు దేశాధినేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆమె మరణం పట్ల యూకేలో విషాద వాతావరణం నెలకొంది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు వచ్చే సోమవారం జరగనున్నాయి. రాణి అంత్యక్రియల సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు ఆహ్వానం పంపింది బ్రిటన్. మూడు దేశాలకు తప్ప అన్ని దేశాలకు ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 17-19 తేదీల్లో జరిగే క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత్ తరుపున సంతాపాన్ని తెలియజేసేందుకు ద్రౌపది ముర్ము లండన్ వెళ్లనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 యూనైటెడ్ కింగ్డమ్( యూకే) దేశాధినేతగా ఉండటంతో పాటు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అధినేతగా ఉన్నారు. సెప్టెంబర్ 8,2022న ఆమె మరణించారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Air India Express Plane: ఎయిరిండియా విమానంలో అగ్నిప్రమాదం.. మస్కట్లో ఘటన
క్వీన్ ఎలిజబెత్ మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్ తన సంతాపాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 12న విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ బ్రిటిష్ హైకమిషన్ సందర్శించారు. భారతదేశం రాణి మరణంతో ఈ సెప్టెంబర్ 11న ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని పాటించింది.
లండన్ నగరంలో జరిగే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు దాదాపుగా 500 మంది విదేశీ ప్రముఖులు హజరయ్యే అవకాశం ఉంది. బ్రిటన్ తో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న అన్ని దేశాలను యూకే ఆహ్వానించింది. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ తో పాటు ఆయన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బిడెన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ప్రధానులు హాజరు కానున్నారు. అయితే ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాను, దాని మిత్ర దేశం బెలారస్ లతో పాటు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న మయన్మార్ దేశాలను ఈ కార్యక్రమాలకు యూకే ఆహ్వానించలేదు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!