Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు..
- శరీరంపై ఆరు చోట్ల గాయాలు..
- మరణానికి ‘‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’’ కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prateek Yadav Death: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మరణం ఉత్తర్ ప్రదేశ్ను షాక్కు గురిచేసింది. 38 ఏళ్ల వయసులో ప్రతీక్ మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం ‘‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’’ అని డాక్టర్లు చెప్పారు. ఉపరితిత్తుల్లోని ఒక సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె, ఊపిరితిత్తులు అకాస్మత్తుగా పనిచేయడం ఆగిపోయి, శరీర వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయి. దీంతోనే మరణం సంభవించినట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది.
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతీక్ యాదవ్ శరీరంపై మొత్తం ఆరు గాయాలను గుర్తించారు. ఛాతీ భాగం, కుడి చేయి, మోచేతి, ఎడమ మణికట్టు ప్రాంతాల్లో ఈ గాయాలు ఉన్నట్లు రిపోర్టు చెప్పింది. వీటిలో కొన్ని 5-7 రోజలు పాతగా తేలింది. మరికొన్ని మరణానికి ఒక రోజు ముందు జరిగినట్లు వైద్యులు తెలిపారు.
Also Read
Read Also: CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
తమ దర్యాప్తును ధ్రువీకరించుకోవడానికి వైద్యులు కెమికల్, హిస్టోపాథలాజికల్ పరీక్షల కోసం అంతర్గత అవయవాలు, గుండెను భద్రపరిచారు. ఏదైనా విషం, ఇతర రసాయన ఆనవాళ్లు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్ష కోసం పంపించనున్నారు. నివేదిక వస్తే మరణానికి మరింత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదిక సమయంలో పాత గాయాలుగా భావిస్తున్న కమిలిన గుర్తుల్ని కనుగొన్నారు. మరణానికి కారణంగా గుండెపోటుగా నిర్ధారించబడింది. అనారోగ్యం కారణంగా ప్రతీక్ ఎడమ కాలి బొటన వేటు నీలి రంగులోకి మారింది. ప్రతీక్ యాదవ్ లివర్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ముందు నుంచే ఉన్నట్లు సమచారం. ఆయన పలుమార్లు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రి తీసుకువచ్చే సమయానికే చనిపోయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!