CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పొదుపు ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అనవసర ఖర్చులను అరికట్టడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనలను ఆయన బలపరిచారు. ఈ క్రమంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని మళ్ళీ తెరపైకి తెస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్తో ప్రయోజనాలు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన విశ్లేషించారు. లక్షలాది మంది వాహనాలపై రోడ్ల మీదకు రాకుండా ఇంటి నుంచే పనిచేస్తే.. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి, దేశం నుంచి తరలిపోయే విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది.
Also Read
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో కూడా పరిస్థితులకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశంపై ఆర్థిక భారం పడుతుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను ప్రజలు ఓపికతో భరించాలని కోరారు. దేశం మొత్తం దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపును ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
గతంలో కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, కుటుంబాలతో గడిపే సమయం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు అదే పంథాలో ఆలోచిస్తూ.. డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలను మరింత బలోపేతం చేయడం ద్వారా కార్యాలయాలకు ప్రజలు వచ్చే అవసరం లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఇది అంతిమంగా పరిపాలనలో వేగాన్ని, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని ఆయన నమ్మకం. ప్రజలు, మేధావులు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని దేశ హితం కోసం సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!