ప్రశాంత్ కిషోర్ వరుస భేటీల వెనుక అసలు రహస్యం ఇదేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు ముందు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో రాహుల్, ప్రియాంకలతో పీకే భేటీ హాట్ టాపిక్గా మారింది.
read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
సిద్దూ, అమరీందర్ మధ్య సాగుతున్న పోరుతో పార్టీకి తీవ్ర నష్టమని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నా.. అధినాయకత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే సిద్దూతో రాహుల్, ప్రియాంకలు పలుసార్లు భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా అమరీందర్ సింగ్ కలిశారు. సిద్దూకి పీసీసీ ఇస్తారని.. అమరీందర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తారనిన ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా అడుగు పడలేదు. అయితే పీకే భేటీతో దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా..? అని భావిస్తున్నారు. 2017 ఎన్నికల్లో అమరీందర్కి ప్రశాంత్కిశోర్ రాజకీయ వ్యూహకర్త వ్యవహరించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా ఆయన పీకేతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. రాహుల్, ప్రియాంకలను కలవడం కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పంజాబ్ రాజకీయాలపైనే ఈ భేటీ సాగిందని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవలే శరద్ పవార్తో పీకే వరుస భేటీలు నిర్వహించారు. అటు ప్రశాంత్కిశోర్తో సమావేశానికి హాజరయ్యేందుకు ప్రియాంక.. యూపీలో కీలక మీటింగ్ను రద్దు చేసుకున్నారు. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకేతో జత కట్టిన రాహుల్ , ప్రియాంకలు… మరోసారి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటు మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నంగా కూడా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!