ప్రశాంత్ కిషోర్ వరుస భేటీల వెనుక అసలు రహస్యం ఇదేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు ముందు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో రాహుల్, ప్రియాంకలతో పీకే భేటీ హాట్ టాపిక్గా మారింది.
read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
సిద్దూ, అమరీందర్ మధ్య సాగుతున్న పోరుతో పార్టీకి తీవ్ర నష్టమని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నా.. అధినాయకత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే సిద్దూతో రాహుల్, ప్రియాంకలు పలుసార్లు భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా అమరీందర్ సింగ్ కలిశారు. సిద్దూకి పీసీసీ ఇస్తారని.. అమరీందర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తారనిన ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా అడుగు పడలేదు. అయితే పీకే భేటీతో దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా..? అని భావిస్తున్నారు. 2017 ఎన్నికల్లో అమరీందర్కి ప్రశాంత్కిశోర్ రాజకీయ వ్యూహకర్త వ్యవహరించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా ఆయన పీకేతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. రాహుల్, ప్రియాంకలను కలవడం కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పంజాబ్ రాజకీయాలపైనే ఈ భేటీ సాగిందని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవలే శరద్ పవార్తో పీకే వరుస భేటీలు నిర్వహించారు. అటు ప్రశాంత్కిశోర్తో సమావేశానికి హాజరయ్యేందుకు ప్రియాంక.. యూపీలో కీలక మీటింగ్ను రద్దు చేసుకున్నారు. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకేతో జత కట్టిన రాహుల్ , ప్రియాంకలు… మరోసారి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటు మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నంగా కూడా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!