ప్రశాంత్ కిషోర్ వరుస భేటీల వెనుక అసలు రహస్యం ఇదేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు ముందు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో రాహుల్, ప్రియాంకలతో పీకే భేటీ హాట్ టాపిక్గా మారింది.
read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
సిద్దూ, అమరీందర్ మధ్య సాగుతున్న పోరుతో పార్టీకి తీవ్ర నష్టమని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నా.. అధినాయకత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే సిద్దూతో రాహుల్, ప్రియాంకలు పలుసార్లు భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా అమరీందర్ సింగ్ కలిశారు. సిద్దూకి పీసీసీ ఇస్తారని.. అమరీందర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తారనిన ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా అడుగు పడలేదు. అయితే పీకే భేటీతో దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా..? అని భావిస్తున్నారు. 2017 ఎన్నికల్లో అమరీందర్కి ప్రశాంత్కిశోర్ రాజకీయ వ్యూహకర్త వ్యవహరించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా ఆయన పీకేతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. రాహుల్, ప్రియాంకలను కలవడం కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పంజాబ్ రాజకీయాలపైనే ఈ భేటీ సాగిందని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవలే శరద్ పవార్తో పీకే వరుస భేటీలు నిర్వహించారు. అటు ప్రశాంత్కిశోర్తో సమావేశానికి హాజరయ్యేందుకు ప్రియాంక.. యూపీలో కీలక మీటింగ్ను రద్దు చేసుకున్నారు. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకేతో జత కట్టిన రాహుల్ , ప్రియాంకలు… మరోసారి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటు మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నంగా కూడా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!