Delhi Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో విద్యుత్ బంద్.. ప్రయాణికులు ఇబ్బందులు
- ఢిల్లీ ఎయిర్ పోర్టులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
- కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురి
- నిలిచిపోయిన చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు
- కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు నిలిచిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణమైంది. విద్యుత్ కోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో తాము చాలా అసౌకర్యానికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. డిజి యాత్ర, చెక్ఇన్ కౌంటర్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో.. ఒక వినియోగదారు ట్విట్టర్లో ఇలా వ్రాశారు, ‘విద్యుత్ వైఫల్యం కారణంగా, ఢిల్లీ విమానాశ్రయం T3 పూర్తిగా చీకటిగా మారింది. కౌంటర్ లేదు, డీజీ లేదు, ఏదీ పని చేయడం లేదు”. అని తెలిపారు.
Salman Khan: సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. రాజస్థాన్ యూట్యూబర్ అరెస్ట్..
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
పవర్ కట్ పై ఢిల్లీ ఎయిర్పోర్ట్ స్పందిస్తూ.. తాము ఫీడ్బ్యాక్ను గుర్తించామని, సంబంధిత బృందంతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే కరెంటు లేదని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం.. బ్యాగేజీ లోడింగ్, డీజీ ప్రయాణం, ఏసీ పని చేయడం ప్రారంభించాయని పేర్కొన్నారు. కాగా.. విద్యుత్తు అంతరాయం విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. “ఎక్కువ AC లోడ్ కారణంగా పూర్తి శక్తికి తిరిగి రావడానికి కొన్ని నిమిషాలు పట్టింది” అని పేర్రొన్నారు. డిజి యాత్ర సిస్టమ్ రీబూట్ చేయబడి.. వెంటనే పని చేయడం ప్రారంభించిందని చెప్పారు.
Delhi Metro : మరోసారి ఢిల్లీ మెట్రో వైరల్.. ఈ సారి ఏంటంటే..!
ఇటీవల ఢిల్లీలోని పలు ప్రాంతాలు విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఓ పవర్ స్టేషన్లో అగ్నిప్రమాదం కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ విద్యుత్తో పాటు, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!