Indian defence: రూ. 1 లక్ష కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు ఆర్డర్..
- ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారీగా రక్షణ కొనుగోళ్లకు అనుమతి..
- రూ. 1 కోట్లతో క్షిపణులు, ఆయుధాల సేకరణకు డీఏసీ ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian defence: రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ ఆమోదం తెలిపింది. ‘‘ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, త్రివిధ దళాల కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణుల సేకరణకు DAC తన అవసరాన్ని అంగీకరించింది. ఈ కొనుగోళ్లు సైన్యం వేగవంతమైన మోహరింపు, సమర్థవంతమైన వాయు రక్షణ, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణను అందిస్తాయి. సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను పెంచుతాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Industrial Tragedy: సిగాచి ఫ్యాక్టరీలో బ్లాస్ట్.. ఈరోజు 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
మూర్డ్ మైన్స్, మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్, సూపర్ రాపిడ్ గన్ మౌంట్,సబ్మెర్సిబుల్ అటానమస్ వెసల్స్ సేకరణకు కూడా డీఏసీ అనుమతి ఇచ్చింది. ఈ కొనుగోళ్లు నావికాదళ, వ్యాపార నౌకలకు ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ని మరింత ప్రోత్సహించడానికి ఇండియా తయారైన వాటిని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటన తెలిపింది.
భారతదేశ స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1.46 లక్షల కోట్లకు చేరుకుందని, ఎగుమతులు 2024-25లో రికార్డు స్థాయిలో రూ. 24,000 కోట్లకు పెరిగాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పదేళ్ల క్రితం రక్షణ ఉత్పత్తి కేవలం రూ. 43,000 కోట్లు మాత్రమే ఉండేది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత తయారీ రక్షణ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. ప్రస్తుతం భారత ఆయుధాలు, వ్యవస్థలు, పరికరాలు, సేవలు దాదాపుగా 100 దేశాలకు చేరుకున్నాయని రక్షణ మంత్రి చెప్పారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి మెగా డిఫెన్స్ ప్రాజెక్ట్లో మొదటిసారిగా పాల్గొనడానికి ప్రైవేట్ రంగానికి అవకాశాన్ని కల్పిస్తుందని, రక్షణ పరిశ్రమలో మేక్ ఇన్ ఇండియా డ్రైవ్ను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!